News February 26, 2025

కురవి జాతర ఏర్పాట్లపై సమీక్ష

image

ఎస్పీ రామ్‌నాథ్ ఆదేశాలతో కురవి జాతర ఏర్పాట్లపై తొర్రూరు డీఎస్పీ కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో మంగళవారం సమీక్ష నిర్వహించారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి, ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని, ట్రాఫిక్ ఇతర అంశాలపై అనుసరించాల్సిన వ్యూహాలపై తొర్రూరు డీఎస్పీ పలు సూచనలు చేశారు. పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Similar News

News November 23, 2025

యాలాల: పెళ్లింట విషాదం.. పెళ్లికూతురి తండ్రి మృతి

image

కూతురు పెళ్లి కోసం అన్ని ఏర్పాట్లు చేసిన తండ్రికి అనుకోని ప్రమాదం జరిగింది. సంగంకుర్డు గ్రామానికి చెందిన అండాల అనంతయ్య తన కూతురి పెళ్లి ఆదివారం నిశ్చయించారు. పెళ్లికి ముందు ఇంట్లో బంధువుల సందడి నెలకొన్న సమయంలో, అనంతయ్య బైక్ పైనుంచి పడి, తీవ్ర గాయాలతో మృతి చెందారు. పెళ్లికి వచ్చిన వారే అంత్యక్రియల్లో పాల్గొనడంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.

News November 23, 2025

రేషన్ కార్డులు ఉన్న వారికి ఫ్రీగా క్లాత్ బ్యాగులు?

image

TG: వచ్చే నెల నుంచి రేషన్ కార్డులు ఉన్న వారికి సన్నబియ్యంతో పాటు మల్టీ పర్పస్ క్లాత్ బ్యాగులను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు సమాచారం. ప్లాస్టిక్ వినియోగం తగ్గించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ బ్యాగులపై ప్రభుత్వ 6 గ్యారంటీల లోగోలు ఉంటాయని అధికార వర్గాలు వెల్లడించాయి. కాగా OCTలోనే ఈ బ్యాగులను పంపిణీ చేయాల్సి ఉండగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా పడింది.

News November 23, 2025

గద్వాల్: మానవత్వానికి మారుపేరు సత్యసాయి బాబా

image

మానవత్వానికి మారుపేరుగా సత్య సాయి బాబా నిలిచారని ఆయన సేవలను ఎల్లప్పుడూ స్మరించుకోవాలని కలెక్టర్ కార్యాలయ ఏ.ఓ.భూపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం సత్య సాయిబాబా పుట్టినరోజు సందర్భంగా శత జయంతి ఉత్సవాలను ఆదివారం గద్వాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో అధికారికంగా నిర్వహించారు. భగవాన్ సత్యసాయి బాబా చిత్రపటానికి పూల మాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసి నివాళి అర్పించారు.