News February 20, 2025
కురవి వీరభద్రస్వామి వారిని దర్శించుకున్న గోపిచంద్

మహబూబాబాద్ జిల్లాలోని కురవి శ్రీ వీరభద్రస్వామి వారిని సినీ హీరో గోపిచంద్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గోపిచంద్ మాట్లాడుతూ.. స్వామివారిని దర్శించుకోవడం గొప్ప అనుభవమని, కోరిన కోరికలు నెరవేరుతాయన్నారు. శివరాత్రి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను ఆలయ కార్యనిర్వాహణాధికారి సత్యనారాయణ, ధర్మకర్త చిన్నం గణేశ్ అందజేశారు.
Similar News
News November 28, 2025
మంచాన్ని గోడలకు ఆనించవచ్చా?

మంచాన్ని గోడకు ఓవైపు మాత్రమే ఆనించి ఉంచాలని, అదే శ్రేయస్కరమని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు చెబుతున్నారు. మిగిలిన 3 వైపులా వీలైనంత ఖాళీ స్థలం ఉండాలంటున్నారు. ‘మంచంపై నుంచి వ్యక్తులు సులభంగా దిగడానికి, ఎక్కడానికి అనుకూలంగా ఉండాలి. గదిలో ఇరుకు ఉండకుండా, ఏ ఇబ్బంది లేకుండా నడిచేలా స్పేస్ ఉండాలి. దీనివల్ల శక్తి ప్రవాహం పెరుగుతుంది. 3 వైపులా గోడలు ఉంటే నిద్ర నాణ్యత దెబ్బతింటుంది’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>
News November 28, 2025
తెలంగాణ గ్లోబల్ సమ్మిట్కు 3,000 మంది ప్రముఖులు

ఉజ్వల తెలంగాణ గ్లోబల్ సమ్మిట్కు ప్రపంచవ్యాప్తంగా 3,000 మంది ప్రముఖులను తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానించింది. మాజీ బ్రిటన్ ప్రధాని టోనీ బ్లేర్, యుఏఈ రాజ కుటుంబ సభ్యుడు షేక్ తారిక్ అల్ ఖాసిమీ, డాయిచ్ బోర్స్ గ్రూప్ హెడ్ లుడ్విగ్ హెయిన్జెల్మాన్తో పాటు ప్రముఖ టెక్ కంపెనీల సీఈవోలు, పెట్టుబడిదారులు, స్టార్టప్ ఫౌండర్లు హాజరుకానున్నారు.
News November 28, 2025
గుంటూరులో పోలీస్ సిబ్బంది గ్రీవెన్స్ డే

గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన పోలీస్ సిబ్బంది గ్రీవెన్స్ డేలో ఎస్పీ వకుల్ జిందాల్ పాల్గొన్నారు. మొత్తం 15 వినతులు స్వీకరించి, వ్యక్తిగత, సర్వీసు, బదిలీ, ఇతర పరిపాలనా సమస్యల పరిష్కారం కోసం సంబంధిత అధికారులను ఆదేశించారు. సిబ్బంది సంక్షేమం పోలీస్ శాఖకు ప్రాధాన్యం అని, భయపడకుండా సమస్యలను నేరుగా తెలియజేయాలని ఆయన సూచించారు.


