News February 20, 2025
కురవి వీరభద్రస్వామి వారిని దర్శించుకున్న గోపిచంద్

మహబూబాబాద్ జిల్లాలోని కురవి శ్రీ వీరభద్రస్వామి వారిని సినీ హీరో గోపిచంద్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గోపిచంద్ మాట్లాడుతూ.. స్వామివారిని దర్శించుకోవడం గొప్ప అనుభవమని, కోరిన కోరికలు నెరవేరుతాయన్నారు. శివరాత్రి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను ఆలయ కార్యనిర్వాహణాధికారి సత్యనారాయణ, ధర్మకర్త చిన్నం గణేశ్ అందజేశారు.
Similar News
News November 16, 2025
రాష్ట్రపతి నిలయంలో వేడుకలు.. ఉచితంగా పాసులు

ఈనెల 21 నుంచి బొల్లారం రాష్ట్రపతి నిలయంలో భారతీయ కళా మహోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. కళాకారులు తమ అద్భుత ప్రదర్శనలతో కనువిందు చేయనున్నారు. 10 రోజుల పాటు ఈ వేడుకలు జరుగనున్నాయి. వీటిని చూడాలనుకున్న వారికి రాష్ట్రపతి నిలయం ఉచితంగా పాసులు అందజేస్తోంది. ఆసక్తిగల వారు ఆన్లైన్లో రిజిస్ర్టేషన్ చేసుకోవాలి.
LINK: https://visit.rashtrapatibhavan.gov.in/plan-visit/rashtrapati-nilayam-hyderabad/p2/p2
News November 16, 2025
HYD: గోల్డెన్ అవర్ మిస్ అయితే గండమే!

ప్రమాదం జరిగిన మొదటి 60 నిమిషాలను గోల్డెన్ హవర్ అని అంటాం. ప్రమాదం జరిగిన గంటలోపు క్షతగాత్రుడికి వైద్యం అందిస్తే ప్రాణాలు దక్కే అవకాశం 90శాతానికిపైగా ఉంటుందని HYD డా.రవి ప్రకాష్ తెలిపారు. బ్రెయిన్ స్ట్రోక్ జరిగిన సమయంలో తొలి 4 గంటలలోపు గోల్డెన్ అవర్గా భావిస్తారు. అయితే తొలి గంటలో వైద్యం 30% మందికి అందక అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారు. SAVE THE LIFE
News November 16, 2025
HYD: ORR, హైవేలపైనే అధిక యాక్సిడెంట్స్!

గ్రేటర్ HYD అవుటర్ రింగ్ రోడ్డు (ORR), దాని చుట్టూ ఉన్న జాతీయ రహదారులపై ప్రమాదాలు ఆందోళనకరంగా పెరుగుతున్నాయని అధికారులు తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది దాదాపు 52% ప్రమాద కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. అధికవేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, రాత్రి వేళల్లో ట్రాఫిక్ నియమాల ఉల్లంఘన వంటి కారణాలు ప్రధానంగా గుర్తించారు.


