News June 5, 2024
కురుపాంలో 30 ఏళ్ల తర్వాత ఎగిరిన టీడీపీ జెండా

తోయక జగదీశ్వరీ విజయంతో కురుపాం కోటపై 30 ఏళ్ల తర్వాత టీడీపీ జెండా ఎగిరింది. టీడీపీ నేతల కృషితో పాటు పుష్పశ్రీవాణి ఉన్న వ్యతిరేకతను తమ అనుకూలంగా మలచుకోవడంలో కూటమి నేతలు సక్సెస్ అయ్యారు. గుమ్మలక్ష్మీపురం మండలం తాడికొండకు చెందిన జగదీశ్వరీ ఎల్విన్ పేట MPTCగా ఉన్నారు. ఆర్థిక బలం లేకపోయినా చంద్రబాబు మన్ననలు, కూటమి సపోర్ట్, చివర్లో మాజీ ఎంపీ ప్రదీప్ దేవ్ కొడుకు వీరేశ్ చంద్రదేవ్ అండతో గెలుపొందారు.
Similar News
News November 18, 2025
VZM: కలెక్టర్ ఆగ్రహం.. ముగ్గురు సచివాలయ సిబ్బందికి నోటీసులు

రామభద్రపురం సచివాలయాన్ని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు పట్టి, సచివాలయం ద్వారా ప్రజలకు అందుతున్న పలు సేవలను ప్రత్యక్షంగా పరిశీలించారు. తనిఖీ సమయంలో కొంతమంది సిబ్బంది నిర్దేశిత సమయానికి హాజరు కాకపోవడం పట్ల కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన ముగ్గురికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆయన ఆదేశించారు.
News November 18, 2025
VZM: కలెక్టర్ ఆగ్రహం.. ముగ్గురు సచివాలయ సిబ్బందికి నోటీసులు

రామభద్రపురం సచివాలయాన్ని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు పట్టి, సచివాలయం ద్వారా ప్రజలకు అందుతున్న పలు సేవలను ప్రత్యక్షంగా పరిశీలించారు. తనిఖీ సమయంలో కొంతమంది సిబ్బంది నిర్దేశిత సమయానికి హాజరు కాకపోవడం పట్ల కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన ముగ్గురికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆయన ఆదేశించారు.
News November 18, 2025
VZM: వారసుల ఎంట్రీ.. వచ్చే ఎన్నికల కోసమేనా..!

విజయనగరం జిల్లా రాజకీయాల్లో యువ నాయకులు ప్రజల్లో కలయ తిరుగుతున్నారు. చీపురుపల్లిలో ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కుమార్తె డాక్టర్ అనూష విస్తృతంగా పర్యటనలు చేస్తుంటే.. ప్రస్తుత ఎమ్మెల్యే కళావెంకట్రావు కుమారుడు రామ్ మల్లిక్ నాయుడు యాక్టీవ్ అయ్యారు. మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల కుమార్తె శ్రావణి, జడ్పీ ఛైర్మన్ చిన్న శ్రీను కుమార్తె సిరి సహస్ర సైతం వివిధ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు.


