News April 21, 2025

కురుపాం: చేపల మృత్యువాతపై స్పందించిన అధికారులు

image

కురుపాం మండల కేంద్రంలో ఉన్న సంత కోనేరు చెరువులో డ్రైన్ వాటర్ చేరి నీరు కలుషితమై చేపలు చనిపోవడంతో Way2Newsలో కథనం ప్రచురించింది. దీనిపై స్పందించిన మత్స్యశాఖ, పంచాయతీ అధికారులు తక్షణమే చెరువులోకి మురుగు వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పంచాయతీ కార్యదర్శి వెంకట్ నాయుడు తెలిపారు. అలాగే ఘటన స్థలాన్ని పంచాయితీ అధికారులు ఉపసర్పంచ్ ఆదిల్ పరిశీలించారు. రైతులకు న్యాయం చేస్తారని హామీ ఇచ్చారు.

Similar News

News April 22, 2025

DSC.. ప్రభుత్వం కీలక ప్రకటన

image

AP: డీఎస్సీ-2025 దరఖాస్తుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు కీలక సూచనలు చేశారు. వివాహిత మహిళా అభ్యర్థులు తమ సర్టిఫికెట్లలో ఉన్న ఇంటిపేరుతోనే అప్లికేషన్ నింపాలని తెలిపారు. ఒక అప్లికేషన్లోనే తమ అర్హతలను బట్టి ఎన్ని పోస్టులకైనా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ఒక పోస్టుకు ఒక జిల్లాలో మాత్రమే అప్లై చేసుకోవాలన్నారు. ఫీజు చెల్లించి సబ్మిట్ చేశాక సవరణలకు అవకాశం ఉండదని స్పష్టం చేశారు.

News April 22, 2025

భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు..!

image

✓ఏసీబీ దాడుల్లో పట్టుబడ్డ మణుగూరు సీఐ, రిపోర్టర్✓ఉపఎన్నిక వస్తే భద్రాచలంలో గులాబీ జెండా ఎగురుతుంది: ఎమ్మెల్సీ కవిత ✓బూర్గంపాడులో రోడ్డు ప్రమాదం వ్యక్తి మృతి ✓మణుగూరులో ఆటో బోల్తా.. స్వల్ప గాయాలు ✓ఆపరేషన్ థియేటర్లో ప్రారంభించిన కొత్తగూడెం ఎమ్మెల్యే ✓ములకలపల్లిలో ఉపాధి హామీ పనులు పరిశీలించిన డీపీఓ

News April 22, 2025

‘ప్రభుత్వ పాఠశాలల్లో సుశిక్షితులైన ఉపాధ్యాయులచే విద్య’

image

ప్రభుత్వ పాఠశాలల్లో సుశిక్షితులైన ఉపాధ్యాయులచే విద్యను నేర్చుకుని మంచి ప్రయోజకులు కావాలని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో గోడ పత్రికను ఆవిష్కరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా బోధనపై శిక్షణ పొందిన ఉపాధ్యాయులు మాత్రమే ఉంటారని, నిర్ణీత విద్య అర్హతలతోపాటు పోటీ పరీక్షలలో అర్హత సాధిస్తేనే ఉపాధ్యాయులుగా పాఠశాలలో నియమించడం జరుగుతుందన్న విషయం అందరికీ తెలిసిందన్నారు.

error: Content is protected !!