News January 27, 2025
కురుపాం: బుల్లెట్ బండిపై కలెక్టర్ పర్యటన

కురుపాం మండలం కరలగండ గ్రామంలోని గుమ్మిడిగెడ్డ ఆనకట్టను ప్రభుత్వ విప్, కురుపాం MLA తోయక జగదీశ్వరితో కలిసి జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ సోమవారం పరిశీలించారు. బుల్లెట్ పై వెళ్తూ ఓ సాధారణ వ్యక్తిలా పర్యటించారు. స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి హామీ ఇచ్చారు. సాధారణ వ్యక్తిలా కలెక్టర్ బుల్లెట్ పై పర్యటించి సమస్యలు తెలుసుకోవడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
Similar News
News November 21, 2025
DWCWEOలో ఉద్యోగాలు

AP:బాపట్లలోని డిస్ట్రిక్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్& ఎంపవర్మెంట్ ఆఫీస్ 8 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 29 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఎంబీబీఎస్, ఇంటర్, బీఏ(సోషల్ వర్క్/సోషియాలజీ/సోషల్ సైన్సెస్), డిగ్రీ, బీఈడీ, 7వ తరగతి అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు 25-42ఏళ్ల మధ్య ఉండాలి. వెబ్సైట్: https://bapatla.ap.gov.in/
News November 21, 2025
అరటి రైతుల ఆక్రందనలు పట్టట్లేదా: షర్మిల

AP: అరటి రైతుల ఆక్రందనలు కూటమి ప్రభుత్వానికి పట్టకపోవడం సిగ్గుచేటు అని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ షర్మిల మండిపడ్డారు. అరటి టన్ను ధర రూ.28వేల నుంచి రూ.వెయ్యికి పడిపోయిందన్నారు. కిలో రూపాయికి అమ్ముకోలేక కష్టపడి పండించిన అరటిని పశువులకు మేతగా వేస్తుంటే రైతు సంక్షేమం ఎక్కడుంది? అని ఫైరయ్యారు. ప్రభుత్వం తక్షణమే రైతుల బాధలను వినాలని, టన్నుకు రూ.25వేలు గిట్టుబాటు ధర దక్కేలా చర్యలు తీసుకోవాలని ట్వీట్ చేశారు.
News November 21, 2025
ఎనుమాముల మార్కెట్లో పత్తి ధర ఎంతంటే..?

గురువారం అమావాస్య సందర్భంగా బంద్ ఉన్న ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ శుక్రవారం ప్రారంభమైంది. ఈ క్రమంలో మార్కెట్కు పత్తి స్వల్పంగానే తరలి రాగా ధర ఆశించిన స్థాయిలో రాలేదని రైతులు నిరాశ చెందుతున్నారు. నేడు మార్కెట్లో క్వింటా పత్తి ధర రూ.6,850 పలికింది. ధరలు పెరిగేలా వ్యాపారులు, అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.


