News March 23, 2024

కురుపాం: సరిహద్దులో నిరంతరం పటిష్ఠ నిఘా: కలెక్టర్

image

రానున్న సాధారణ ఎన్నికల దృష్ట్యా ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్‌ల వద్ద నిరంతర పటిష్ఠ నిఘా ఉండాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. శనివారం కురుపాం మండలం మంత్ర జోల సమీపంలోని మూలిగూడ సెంటర్ వద్ద ఏర్పాటుచేసిన చెక్‌పోస్ట్‌ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రస్తుతం ఎన్ని కేసులు, వాహనాలు సీజ్ చేసిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.

Similar News

News November 24, 2025

రాజాం: ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య

image

అనుమానాస్పద స్థితిలో వివాహిత ఉరి వేసుకుని మృతి చెందిన సంఘటన రాజాం సారధి రోడ్డులో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. రాజాంలో ఓ షాపింగ్ మాల్‌లో పనిచేస్తున్న ఉర్లాపు సావిత్రి (30) ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకుంది. సావిత్రి ఉరి వేసుకుని మృతి చెందడం పట్ల కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మృతురాలికి భర్త, కొడుకు, కుమర్తె ఉన్నారు. పోలీసులు సంఘటన స్థ‌లాన్ని ప‌రిశీలించారు.

News November 24, 2025

డిసెంబర్ 5న APNGGO కొత్తవలస యూనిట్ ఎన్నికలు

image

కొత్తవలసలోని APNGGO యూనిట్ ఎన్నిక డిసెంబర్ 5 న నిర్వహిస్తున్నట్లు ఎన్నికల అధికారి సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు K.ఆదిలక్ష్మి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. సహాయ ఎన్నికల అధికారిగా యెర్రా రమణ, ఎన్నికల పరిశీలకులుగా ఆనంద్ కుమార్ వ్యవహరిస్తారన్నారు. ఈనెల 28న నామినేషన్ వేయాలని, కొత్తవలస, వేపాడ ఎల్కోటలో ఉన్న ఉద్యోగస్తులు ఈ అవకాశం వినియోగించుకోవాలన్నారు.

News November 24, 2025

డిసెంబర్ 5న APNGGO కొత్తవలస యూనిట్ ఎన్నికలు

image

కొత్తవలసలోని APNGGO యూనిట్ ఎన్నిక డిసెంబర్ 5 న నిర్వహిస్తున్నట్లు ఎన్నికల అధికారి సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు K.ఆదిలక్ష్మి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. సహాయ ఎన్నికల అధికారిగా యెర్రా రమణ, ఎన్నికల పరిశీలకులుగా ఆనంద్ కుమార్ వ్యవహరిస్తారన్నారు. ఈనెల 28న నామినేషన్ వేయాలని, కొత్తవలస, వేపాడ ఎల్కోటలో ఉన్న ఉద్యోగస్తులు ఈ అవకాశం వినియోగించుకోవాలన్నారు.