News October 18, 2024
కులగణనకు సిద్ధం.. తరువాతే స్థానిక ఎన్నికలు
కులగణన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఇంటింటికీ తిరిగి అన్ని కుటుంబాల ఆర్థిక, సామాజిక స్థితిగతుల్ని అంచనా వేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఇప్పటికే మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. 2 నెలల్లోపే పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 2014లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో చేపట్టిన సమగ్ర సర్వేలో జనాభా 42,84,024 ఉండగా, 9,67,013 కుటుంబాలు నివసిస్తున్నట్లు తేల్చారు.
Similar News
News October 18, 2024
ఆదర్శ ప్రాయుడు సర్వాయి పాపన్న: మంత్రి పొన్నం
బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ అందరికి ఆదర్శప్రాయుడని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు. గద్వాలలోని కృష్ణవేణి చౌరస్తాలో ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. మొఘల్రాజుల ప్రాబల్యం పెరుగుతున్నతరుణంలో వారి ఆధిపత్యం అంతమొందించడంతోపాటు జమీందార్లు, జాగీర్దార్ల దురాగతాలను గమనించి గోల్కొండ కోటపై బడుగుల జెండాను పాపన్నగౌడ్ ఎగురవేశారని మంత్రి గుర్తుచేశారు.
News October 18, 2024
MBNR: పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్
హన్వాడ మండలం అమ్మాపూర్ తాండ పంచాయతీ కార్యదర్శి శివప్రకాశ్ శుక్రవారం అధికారులు సస్పెండ్ చేశారు. శివప్రకాశ్ గతంలో జడ్చర్ల మండలం పోలేపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేశాడు. ఈయన పని చేసిన కాలంలో రూ.1.73 కోట్ల గ్రామ పంచాయతీ నిధులు దుర్వినియోగం అయ్యాయని గత నెలలో జరిపిన DPLO విచారణలో తేలింది. ఈ మేరకు సస్పెన్షన్కు గురయ్యారు.
News October 18, 2024
ఆర్టీసీ బస్సును ఓవర్ టేక్ చేయబోయి…అనంతలోకాలకు
ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన <<14388888>>పెద్దకొత్తపల్లి <<>>మండలం వెన్నచర్ల గ్రామ శివారులో జరిగింది. స్థానికుల వివరాలు.. అదే గ్రామానికి చెందిన సందడి శైలేష్(19) పంట పొలంలో పురుగు మందు పిచికారి చేసేందుకు తన ఇద్దరి స్నేహితులతో కలిసి బైక్ పై వెళ్తుండగా.. ఆర్టీసీ బస్సును ఓవర్ టేక్ చేయబోయాడు. వెనకాల ఉన్న మరో ఇద్దరు యువకులు కిందికి దూకగా బైక్ నడుపుతున్న యువకుడు బస్సు కింద నలిగి మృత్యువాత పడ్డాడు.