News April 11, 2025
కుల వృత్తిదారులతో ముచ్చటించిన సీఎం చంద్రబాబు

ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం వడ్లమానులో పర్యటించిన సీఎం చంద్రబాబు పలు కుల వృత్తిదారుల ఇళ్లకు వెళ్లారు. వారితో మాట్లాడి సమస్యలను తెలుసుకుని వారికి ప్రోత్సాహకాలు అందించారు. జగన్నాథం అనే వ్యక్తికి చెందిన బార్బన్ షాపుని పరిశీలించి ఆయనతో మాట్లాడారు. బార్బన్ కిట్ను అందజేశారు. అనంతరం ఆగిరిపల్లి మార్కెట్ యార్డులో మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహానికి నివాళులు అర్పించారు.
Similar News
News April 16, 2026
10-20% పెరగనున్న మందుల ధరలు?

క్యాన్సర్ సహా ఇతర అత్యవసర మెడిసిన్ ధరలను 10-20% పెంచేందుకు ఫార్మా కంపెనీలకు కేంద్రం అనుమతిచ్చే అవకాశముందని నేషనల్ మీడియా పేర్కొంది. యుద్ధం నేపథ్యంలో ముడిపదార్థాల రవాణాలో అంతరాయం, ఖర్చులు పెరగడంతో ధరలు పెంచాలని కంపెనీలు కోరినట్లు తెలిపింది. దీనిపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్లు వెల్లడించింది. ఈ పెంపు తాత్కాలికంగా 3 నెలలు వరకు మాత్రమే ఉంటుందని, పరిస్థితులు చక్కబడిన తర్వాత ధరలు తగ్గిస్తారని సమాచారం.
News April 16, 2026
రాబోయే 2 గంటల్లో వర్షం

TG: వచ్చే 2 గంటల్లో పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. వికారాబాద్, మేడ్చల్, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్, హనుమకొండ జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపారు. హైదరాబాద్లోనూ పలు ప్రాంతాల్లో వర్షం పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ వర్షాల వల్ల ఉక్కపోత, వేడి మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు.
News April 16, 2026
మహిళలకు ఈ క్యాన్సర్ల ముప్పు ఎక్కువ

మహిళలకు వచ్చే క్యాన్సర్ వ్యాధుల్లో సర్వైకల్ (గర్భాశయ ముఖద్వార) క్యాన్సర్ మొదటిస్థానంలో ఉంటుంది. దీని తర్వాత స్థానం రొమ్ము క్యాన్సర్. వీటితోపాటు యూట్రస్ క్యాన్సర్, అండాశయ (ఓవేరియన్) క్యాన్సర్ కూడా ఎక్కువగా వస్తున్నాయి. రొమ్ము క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్ వ్యాధులు వంశపారంపర్యంగా వస్తాయి. వీటిని రాకుండా ఆపలేం కానీ, రాకముందే గుర్తించి అప్రమత్తమై చికిత్స చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.


