News January 29, 2025
కుష్టు వ్యాధిగ్రస్తులు సంఖ్య తగ్గుతుంది: DMHO

గుంటూరు జిల్లాలో జరుగుతున్న లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్స్ (LCDC)ని తమిళనాడుకు చెందిన LCDC మానిటరింగ్ టీమ్ అధికారులు రంగనాథ్, అక్షర్ పురోహిత్ మంగళవారం పరిశీలించారు. ఈమని ప్రైమరీ హెల్త్ సెంటర్లో సభ్యులు ఈ సందర్భంగా పరిశీలన చేశారు. అనంతరం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి విజయలక్ష్మీ తన ఛాంబర్లో కార్యక్రమం పై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో కుష్టు వ్యాధిగ్రస్తులు సంఖ్య తగ్గుతుందన్నారు.
Similar News
News November 20, 2025
నేరస్థులను ప్రోత్సహించేలా జగన్ తీరు: వర్ల

హైదరాబాద్లో జగన్ ఆడిన ‘డ్రామా’, నటించిన తీరు వర్ణనాతీతం, చట్ట వ్యతిరేకమని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. నాంపల్లి కోర్టుకు హాజరైన సందర్భంగా జరిగిన రభస, అలజడి సీబీఐ కోర్టును ప్రభావితం చేసేదిగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడారు. ఒక ముద్దాయి కోర్టుకు వస్తుంటే జనం ఎందుకు రావాలి? జగన్ దేశం కోసం పోరాడిన వ్యక్తి కాదన్నారు.
News November 20, 2025
నేరస్థులను ప్రోత్సహించేలా జగన్ తీరు: వర్ల

హైదరాబాద్లో జగన్ ఆడిన ‘డ్రామా’, నటించిన తీరు వర్ణనాతీతం, చట్ట వ్యతిరేకమని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. నాంపల్లి కోర్టుకు హాజరైన సందర్భంగా జరిగిన రభస, అలజడి సీబీఐ కోర్టును ప్రభావితం చేసేదిగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడారు. ఒక ముద్దాయి కోర్టుకు వస్తుంటే జనం ఎందుకు రావాలి? జగన్ దేశం కోసం పోరాడిన వ్యక్తి కాదన్నారు.
News November 20, 2025
రాజధాని రైతుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ఫోకస్

రాజధాని రైతుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ఫోకస్ చేసింది. అమరావతి రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లలో వేసిన సరిహద్దు రాళ్లు వివిధ కారణాలతో తొలగిపోయినట్లు మంత్రి నారాయణ దృష్టికి రైతులు తీసుకొచ్చారు. మంత్రి ఆదేశాలతో డిసెంబర్ 15వ తేదీ నుంచి హద్దు రాళ్లు లేని ప్లాట్ల పెగ్ మార్క్ వేసి హద్దు రాళ్లు వేయాలని CRDA నిర్ణయించింది. 3 నెలల్లోగా రైతుల ప్లాట్లలో సరిహద్దు రాళ్లు వేయడం పూర్తి చేయనుంది.


