News February 8, 2025
కూకట్పల్లిలో తూ.గో జిల్లా వివాహిత SUICIDE

ఆర్థిక ఇబ్బందులు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన కూకట్ పల్లి పీఎస్ పరిధిలోని సుమిత్రానగర్లో చోటుచేసుకుంది. ఎస్సై దీక్షిత తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన బీశెట్టి కనక రత్నమ్మ (46) ఇంట్లో సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి భర్త సత్తిబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు.
Similar News
News February 8, 2026
విజయవాడలో నేడు నాన్ వెజ్ ధరలు ఇవే!

విజయవాడలో ఆదివారం నాన్ వెజ్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. చికెన్ స్కిన్ లెస్ కేజీ రూ. 280, స్కిన్ రూ. 270లుగా విక్రయిస్తున్నారు. డిమాండ్ను బట్టి కొన్ని ప్రాంతాల్లో స్వల్ప మార్పులు ఉన్నట్లు సమాచారం. మటన్ కేజీ రూ. 1000లగా ఉంది. చేపల్లో బొచ్చ కేజీ రూ. 220లు, 30 కోడిగుడ్లు గతవారం రూ. 165లు ఉండగా నేడు రూ. 153లకు చేరుకుంది. మరి మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి
News February 8, 2026
KMR: ఈ నెల 9 నుంచి 14 వరకు సీఎం కప్ జిల్లా స్థాయి క్రీడలు

కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు పలు ప్రదేశాల్లో చీఫ్ మినిస్టర్ కప్-2026 జిల్లా స్థాయి క్రీడలను ఈ నెల 9 నుంచి 14 వరకు నిర్వహించనున్నట్లు జిల్లా యూత్&స్పోర్ట్స్ ఆఫీసర్ రంగ వెంకటేశ్వర్ గౌడ్ తెలిపారు. పలు క్రీడలకు ఇన్ఛార్జ్లను సైతం నియమించారు. ఆయా ప్రదేశాల్లో ఏర్పాటు చేసే క్రీడల వద్ద ప్రాథమిక చికిత్స శిబిరాలను ఏర్పాటు చేయాలని DMHO డా.విద్యను ఆయన కోరారు. సంబంధిత PHC సిబ్బందిని ఆమె నియమించారు.
News February 8, 2026
కలర్ ఫుల్గా ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ!

ప్రశాంత్ నీల్ సినిమాలు అనగానే గ్రే/బ్లాక్ కలర్ షేడ్లో ఉంటాయనే పేరుంది. అయితే ఎన్టీఆర్తో తీస్తున్న సినిమా కలర్ ఫుల్గా ఉండనుందని తెలుస్తోంది. రెగ్యులర్ స్టైల్లో కాకుండా కొత్త టేకింగ్తో తీస్తున్నారని సమాచారం. ఈ సినిమాలో ఎన్టీఆర్ డిఫరెంట్ లుక్లో కనిపించనున్న సంగతి తెలిసిందే. ఈ పాత్ర కోసం సన్నబడిన ఆయన భారీగా గడ్డం కూడా పెంచారు. కాగా సమ్మర్లో ఈ మూవీ షూటింగ్ పూర్తి కానుందని టాక్.


