News June 17, 2024
కూకట్పల్లి: జేఎన్టీయూలో ఆందోళనలపై నిషేధాజ్ఞలు

JNTUలో విద్యార్థుల ఆందోళనలు, ధర్నాలు, ర్యాలీల కట్టడికి వర్సిటీ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా రిజిస్ట్రార్ డా.వెంకటేశ్వరరావు వర్సిటీ క్యాంపస్, ఇంజినీరింగ్ కాలేజీలకు సర్కులర్ జారీ చేశారు. సాంబారులో పురుగులు ఉన్నాయంటూ మంజీరా హాస్టల్లో విద్యార్థులు ధర్నా చేయడం, వర్సిటీ పాలనాపరమైన కొందరి పదోన్నతులపై ధర్నా నేపథ్యంలో ఇన్ఛార్జ్ వీసీ వెంకటేశం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.
Similar News
News January 22, 2026
త్వరలో జలమండలి విస్తరణ షురూ!

జీహెచ్ఎంసీ పునర్విభజనతో జలమండలి విస్తరణ కూడా షురూ కానుంది. శివారు ప్రాంతాల విలీనంతో జలమండలి తన సేవలను విస్తరించేందుకు సిద్ధమవుతోంది. కొత్త జోన్లు, సర్కిళ్ల ఏర్పాటుతో సేవలు మరింత విస్తృతం చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే 12 కొత్త జోన్లు, 60 సర్కిల్లను ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు పూర్తి చేశారు. త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక సమర్పించి, జలమండలి విస్తరణకు ముహూర్తం ఖరారు చేయనున్నారు.
News January 22, 2026
HYD @2053 KM.. ఒక్క సంస్థ నీటి సరఫరా సాధ్యమా?

మహానగరం పరిధి పెరగింది. దీంతో జలమండలి కూడా పునర్విభజన అనంతరం ఏర్పడ్డ గ్రేటర్ కు నీటి సరఫరా చేయనుంది. ఈ మేరకు అధికారులు ప్రతిపాదనలు సర్కారుకు పంపినట్లు తెలిసింది. అయితే 2053 KM విస్తరించిన నగరానికి ఒక్క వాటర్ బోర్డు నీటి సరఫరా సాధ్యమా అనే అనుమానాలు కూడా పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడే నీటి సమస్యలు ఉత్పన్నమవుతుంటే వేల కిలోమీటర్ల పరిధి వరకు సరఫరా ఎలా చేస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు.
News January 22, 2026
గ్రేటర్లో పెరిగిన విద్యుత్ వినియోగం

గ్రేటర్ హైదరాబాద్లో విద్యుత్ వినియోగం పెరిగింది. వేసవి ఎండలు మొదలు కాకముందే విద్యుత్ వినియోగం పెరగడంపై అధికారులు అప్రమత్తమవుతున్నారు. బుధవారం ఒక్కరోజు 3,364 మెగావాట్ల విద్యుత్ వినియోగించినట్లు అధికారులు వెల్లడించారు. అయితే గతేడాది వేసవిలో 4,190 నమోదు అయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఈ ఏడాది మరింతగా వినియోగం పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.


