News February 6, 2025

కూకట్‌పల్లి-నిజాంపేటలో హైడ్రా కూల్చివేతలు.. క్లారిటీ

image

కూక‌ట్‌ప‌ల్లి-నిజాంపేట రోడ్డులోని హోలిస్టిక్ ఆసుప‌త్రి వెనుక ప్ర‌భుత్వ స్థ‌లం చుట్టూ నిర్మించిన ప్ర‌హ‌రీని బుధ‌వారం హైడ్రా తొల‌గించింది. ‘300ల గ‌జాల ఇంటి స్థ‌లం క‌బ్జాకు గురైంద‌ని ఓ మాజీ సైనికుడు ఫిర్యాదు చేశారు. విచార‌ణ చేయగా దాదాపు 1253 గ‌జాల ప్ర‌భుత్వ భూమి క‌బ్జాకు గురైన‌ట్లు తేలింది. దీంతో క‌బ్జా చేసిన స్థ‌లం చుట్టూ నిర్మించిన ప్ర‌హ‌రీని హైడ్రా తొల‌గించింది’ అని అధికారులు స్పష్టం చేశారు.

Similar News

News November 21, 2025

రాజీనామా యోచనలో కడియం..?

image

వరంగల్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. జూబ్లీహిల్స్ గెలుపు ఊపులో ఉన్న కాంగ్రెస్.. ఫిరాయింపుల విషయంలో రాజీనామా చేయించాలని చూస్తోంది. స్టే.ఘనపూర్ MLAగా ఉన్న కడియం శ్రీహరితో రాజీనామా చేయించి, ఎన్నికలకు వెళ్లి BRSను ఇరుకున పెట్టడానికి CM రేవంత్ స్కెచ్ వేస్తున్నట్లు సమాచారం. ఇదే వేడిలో ఉపఎన్నిక వస్తే కాంగ్రెస్‌కు గ్రౌండ్‌లో మరింత బలం పెరుగుతుందని భావిస్తున్నారు. 2 రోజుల్లో కడియం రాజీనామా చేసే అవకాశముంది.

News November 21, 2025

1956లో ప్రస్థానం ప్రారంభం.. నేటికి JNTUకి 60 ఏళ్లు

image

జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల డైమండ్ జూబ్లీ వేడుకలకు ముస్తాబైంది. 1965లో నాగార్జున ఇంజినీరింగ్ కళాశాలగా ఆవిర్భవించి 1972లో జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌గా అవతరించింది. 2015లో గోల్డెన్ జూబ్లీ వేడుకలు నిర్వహించుకొని నేడు డైమండ్ జూబ్లీ వేడుకలకు యూనివర్సిటీ కళాశాల సిద్ధమైంది. ఈ 60 ఏళ్లలో ఎన్నో ఘనతలు సాధించి ఎంతోమంది విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్చింది.

News November 21, 2025

నల్గొండ: లంచగొండి అధికారులు.. 11 నెలల్లో 15 కేసులు

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో అవినీతికి పాల్పడుతున్న లంచగొండి ప్రభుత్వ అధికారులను ఏసీబీ వలపన్ని పట్టుకుంటూ దడ పుట్టిస్తోంది. నెలనెల లక్షల్లో జీతాలు తీసుకుంటూ కూడా కొందరు అధికారులు అత్యాశకు పోయి, ప్రతీ పనికి ధర నిర్ణయించి డబ్బులు దండుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది 11 నెలల్లోనే ఉమ్మడి జిల్లాలో సుమారు 15 ఏసీబీ కేసులు నమోదవడం గమనార్హం.