News March 9, 2025
కూటమి విద్యార్థులను మోసం చేసింది: అవినాశ్

ఈ నెల 12వ తేదీన వైసీపీ ఆధ్వర్యంలో ఫీజు పోరు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాశ్ తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను వైసిపి శ్రేణులతో కలిసి ఆదివారం ఆవిష్కరించారు. విద్యార్థులను నమ్మించి కూటమి ప్రభుత్వం మోసం చేసిందన్నారు. అబద్దాలు చెప్పి విద్యార్థులను కూటమి ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.
Similar News
News February 23, 2026
చరిత్రలో ఈరోజు (ఫిబ్రవరి 23)

1455- గూటెన్బర్గ్ తొలి బైబిల్ ముద్రణ పూర్తి
1876- ప్రముఖ సంఘ సంస్కర్త గాడ్గే మహరాజ్ జననం
1893- డీజిల్ ఇంజిన్కు పేటెంట్
1913- ప్రముఖ ఇంద్రజాలికుడు పి.సి.సర్కార్ జననం
1954- పోలియో వ్యాక్సిన్ మొదటిసారిగా పిల్లలపై ప్రయోగం
1957- దివంగత మాజీ మంత్రి ఎర్రన్నాయుడు జననం
1969- అలనాటి హీరోయిన్ మధుబాల మరణం (ఫొటోలో)
* World Understanding and Peace Day
News February 23, 2026
సదాశివపేటలో యువకుడిపై కర్రతో దాడి

సదాశివపేట మండలంలోని కోల్కూర్ గ్రామంలో ఆదివారం రాత్రి ఇద్దరు యువకుల మధ్య జరిగిన ఘర్షణ రక్తపాతానికి దారితీసింది. 10 గంటల సమయంలో చాకలి వీరేశం, రంజిత్ మధ్య మాట మాట పెరిగి వివాదం చెలరేగింది. ఈ క్రమంలో రంజిత్ కర్రతో దాడి చేయడంతో వీరేశం తలకు బలమైన గాయమైంది. 108 సిబ్బంది బాధితుడికి ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం సంగారెడ్డి జిల్లా ఆసుపత్రికి తరలించారు.
News February 23, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.


