News March 9, 2025

కూటమి విద్యార్థులను మోసం చేసింది: అవినాశ్

image

ఈ నెల 12వ తేదీన వైసీపీ ఆధ్వర్యంలో ఫీజు పోరు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాశ్ తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను వైసిపి శ్రేణులతో కలిసి ఆదివారం ఆవిష్కరించారు. విద్యార్థులను నమ్మించి కూటమి ప్రభుత్వం మోసం చేసిందన్నారు. అబద్దాలు చెప్పి విద్యార్థులను కూటమి ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.

Similar News

News February 8, 2026

రెండో టీ20కి భారత జట్టుతో చేరనున్న సుందర్: సూర్య

image

గాయం నుంచి కోలుకున్న వాషింగ్టన్ సుందర్ రెండో టీ20కి అందుబాటులో ఉంటారని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపారు. ఢిల్లీ వేదికగా నమీబియాతో జరిగే మ్యాచులో జట్టులో చేరుతారని పేర్కొన్నారు. న్యూజిలాండ్‌తో తొలి వన్డే సమయంలో సుందర్ గాయపడ్డారు. ఆ సిరీస్‌‌లో సుందర్ స్థానంలో బదోనిని తీసుకున్నా T20WC స్క్వాడ్‌లో మాత్రం ఆయన స్థానాన్ని రీప్లేస్ చేయలేదు. ఆల్‌రౌండర్ సుందర్ రాకతో భారత్ మరింత పటిష్టంగా మారనుంది.

News February 8, 2026

వరంగల్: మల వ్యర్థాలు బహిరంగంగా వేస్తే జైలుకే!

image

మల వ్యర్థాలను బహిరంగంగా పారబోస్తే కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. శనివారం శానిటేషన్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. ముఖ్యంగా సెలవు రోజుల్లో సానిటరీ ఇన్‌స్పెక్టర్లు క్షేత్రస్థాయిలో ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించే వాహనాలను సీజ్ చేయాలని స్పష్టం చేశారు.

News February 8, 2026

ముకుందాపురంలో సాగర్ ఎడమ కాలువలో గల్లంతైంది వీరే

image

ముకుందాపురంలో ఓ కారు ప్రమాదవశాత్తూ అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లిన విషయం తెలిసిందే. శనివారం జరిగిన ఈ ఘటనలో కారులోని ప్రయాణిస్తున్న దంపతులిద్దరూ గల్లంతవ్వగా, డ్రైవర్ సురక్షితంగా బయట పడ్డాడు. నీటిలో మునిగిపోయిన భార్యభర్తలు త్రిపురారం(M) కంపాసాగర్‌ చెందిన పుల్లయ్య, పద్మగా సమాచారం. పోలీసులు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.