News January 30, 2025
కూడవెళ్లి వాగులో పడి మృతి.. మృతుడు దుబ్బాక వాసి

అక్బర్ పేట భూంపల్లి మండలంలోని కూడవెళ్లి వాగులో మునిగి ఒకరు మృతిచెందిన విషయం తెలిసిందే. మాఘ మాస సందర్భంగా దుబ్బాక మండలం పెద్దగుండవెల్లి గ్రామానికి చెందిన బిట్ల శివరాములు(50) కూడవెల్లి రామలింగేశ్వర స్వామి దర్శనానికి వెళ్లారు. ఈ క్రమంలో వాగులోకి దిగిన ఆయన ప్రమాదశాత్తు అందులో మునిగి మృతిచెందాడు. ఘటన స్థలాన్ని సిద్దిపేట ఏసీపీ మధు, దుబ్బాక సీఐ శ్రీనివాస్, ఎస్ఐలు హరీష్, గంగరాజు పరిశీలించారు.
Similar News
News November 25, 2025
పిల్లలు నూడుల్స్, పాస్తా తింటే కలిగే నష్టాలు తెలుసా?

రిఫైన్డ్ ఫ్లోర్తో తయారు చేసే నూడుల్స్, పాస్తా తింటే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. వీటిలో ఉండే అధిక సోడియంతో పిల్లల్లో బీపీ, గుండె, కిడ్నీ సమస్యలు వస్తాయి. మెటబాలిక్ సిండ్రోమ్ రిస్క్ పెరిగి డయాబెటిస్, హై కొలెస్ట్రాల్కు దారితీస్తుంది. ప్రొటీన్స్, విటమిన్స్, ఫైబర్ తక్కువగా ఉండడంతో ఒబెసిటీ, పోషకాహార లోపం ఏర్పడుతుంది. జీర్ణక్రియ సమస్యలు, క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.
News November 25, 2025
కృష్ణానదిలో గుర్తు తెలియని మృతదేహలు కలకలం

కృష్ణానది సీతమ్మవారి పాదాల సమీపంలో మంగళవారం ఇద్దరి మృతదేహలు కలకలం సృష్టించాయి. సుమరు 40 సంవత్సరాల వ్యక్తి, 12 సంవత్సరాల బాలుడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని నీళ్లలో నుంచి బయటికి తీసి గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రికి పంపించామని పోలీసులు తెలిపారు. బ్యారేజ్ ర్యాంప్ సమీపంలో మృతదేహాలను గుర్తించామని, దర్యాప్తు చేస్తున్నామని స్పష్టం చేశారు.
News November 25, 2025
FLASH: బోరబండలో నిప్పు అంటించుకున్న హిజ్రాల్లో ముగ్గురి మృతి

ట్రాన్స్జెండర్ మోనాలిసాకు వ్యతిరేకంగా ఇటీవల బోరబండ బస్టాండ్లో ఓ వర్గం చేపట్టిన ఆందోళన తీవ్ర విషాదంగా మారింది. ఆందోళన సమయంలో పెట్రోల్ పోసుకున్న ట్రాన్స్జెండర్లలో చికిత్స పొందుతూ మంగళవారం నవనీత (24) బాలానగర్లోని ఓ ఆస్పత్రిలో మరణించింది. ఈ నెల 20న అప్సానా, 23న హీనా కూడా చనిపోయిన సంగతి తెలిసిందే. బోరబండ ఘటనలో చనిపోయిన వారి సంఖ్య మూడుకు చేరింది.


