News January 30, 2025
కూడవెళ్లి వాగులో పడి మృతి.. మృతుడు దుబ్బాక వాసి

అక్బర్ పేట భూంపల్లి మండలంలోని కూడవెళ్లి వాగులో మునిగి ఒకరు మృతిచెందిన విషయం తెలిసిందే. మాఘ మాస సందర్భంగా దుబ్బాక మండలం పెద్దగుండవెల్లి గ్రామానికి చెందిన బిట్ల శివరాములు(50) కూడవెల్లి రామలింగేశ్వర స్వామి దర్శనానికి వెళ్లారు. ఈ క్రమంలో వాగులోకి దిగిన ఆయన ప్రమాదశాత్తు అందులో మునిగి మృతిచెందాడు. ఘటన స్థలాన్ని సిద్దిపేట ఏసీపీ మధు, దుబ్బాక సీఐ శ్రీనివాస్, ఎస్ఐలు హరీష్, గంగరాజు పరిశీలించారు.
Similar News
News November 15, 2025
ADB: 25వ ఏటే అమరుడయ్యాడు!

ఆదివాసీ సమరయోధుడిగా చరిత్రకెక్కెని గొప్ప వీరుడు బిర్సా ముండా. ఆయన 1876నవంబర్ 15న ఝార్ఖండ్ ఉళిహటులో జన్మించారు. బ్రిటిషర్లకు వ్యతిరేకంగా మిలీనేరియన్ ఉద్యమానికి సారథ్యం వహించారు. బిర్సా 1899 డిసెంబర్లో ఉల్గులన్ (విప్లవం) ప్రారంభించారు. ఎన్నో పోరాటాల అనంతరం తొలిసారి 1898లో బ్రిటిషర్లను ఓడించారు. 1900 ఫిబ్రవరి 3న ఆయన్ను అరెస్ట్ చేసి రాంచీ జైల్లో పెట్టారు. 1900జూన్ 9న తన 25వ ఏట జైల్లోనే అమరుడయ్యారు.
News November 15, 2025
సిరిసిల్ల: దుకాణాల సర్దుబాటు కోసం డీల్.. గుడ్ విల్..!

జిల్లాలో మద్యం దుకాణాలు పొందిన వ్యాపారులు తమకు అనుకూలమైన ప్రదేశాలలో వాటిని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 48 దుకాణాల కోసం 1,381 దరఖాస్తులు రాగా డ్రా ద్వారా ఎంపిక చేశారు. ఇప్పటికే ఈ వ్యాపారంలో ఉన్నవారికి మరో చోట షాపు రావడంతో అక్కడ షాపు లభించిన వారితో చర్చలు జరిపి సర్దుబాటు చేసుకుంటున్నారు. కొత్తగా లైసెన్స్ దక్కిన వ్యక్తికి కోటి రూపాయల గుడ్ విల్ ఇచ్చి దుకాణం తీసుకున్నట్లు టాక్.
News November 15, 2025
కృష్ణా: కలెక్టరేట్లో చెత్తాచెదారం తొలగించిన కలెక్టర్

స్వర్ణ ఆంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ ప్రాంగణంలో కలెక్టరేట్ ఉద్యోగులు శ్రమదానం చేశారు. కలెక్టర్ డీకే బాలాజీతోపాటు వివిధ శాఖ అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది శ్రమదానంలో పాల్గొన్నారు. పలు ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాల్లో పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని తొలగించారు. కార్యక్రమంలో డీఆర్ఓ చంద్రశేఖరరావు, తదితరులు పాల్గొన్నారు.


