News April 4, 2025
కూర్మన్నపాలెంలో 100 కేజీల గంజాయి పట్టివేత

గాజువాక సమీపంలో గల కూర్మన్నపాలెం వద్ద అర్ధరాత్రి పోలీసులు తనిఖీలు చేపట్టారు. ప్రైవేట్ బస్సులో ఐదుగురు వ్యక్తులు హైదరాబాద్ తరలించేందుకు 44 బ్యాగుల్లో సిద్ధంగా ఉంచిన గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఢిల్లీ చెందిన నలుగురు ముఠా పరారు కాగా.. భగత్ సింగ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు దువ్వాడ పోలీసులు తెలిపారు. పట్టుబడిన గంజాయి 100 కేజీల వరకు పోలీసులు వెల్లడించారు.
Similar News
News April 25, 2025
విశాఖలో చంద్రమోలి అంతిమ యాత్ర

పహల్గాంలో ఉగ్రమూకల కాల్పుల్లో మరణించిన చంద్రమోలి అంతిమ యాత్ర విశాఖలో ప్రారంభమైంది. పాండురంగాపురంలో ఆయన పార్థివదేహానికి మంత్రులు అనిత, సత్యకుమార్, అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ నివాళులు అర్పించి పాడె మోశారు. జ్ఞానాపురం శ్శశాన వాటికలో ఆయన దహన సంస్కణలు పూర్త చేయనున్నారు.
News April 25, 2025
విశాఖ జూలో వేసవి తాపానికి చెక్

వేసవికాలం గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో విశాఖ జూ పార్కులో వన్యప్రాణుల వేసవితాపం జూక్యూరేటర్ మంగమ్మ, సిబ్బంది ప్రత్యేక దృష్టి పెట్టారు. కొన్ని రకాల జంతువుల వద్ద వాటర్ స్పింక్లర్లు ఏర్పాటు చేయడం, సాదు జంతువులకు వాటర్ స్ప్రే చేయడం, కొన్ని రకాల పక్షులకు, జంతువులకు ఎయిర్ కండిషన్స్ ఏర్పాటు చేయడం వంటి సదుపాయాలు కల్పించారు.అదేవిధంగా వాటర్ మిలన్, కర్బూజా వంటి చల్లని పదార్థాలు అందజేస్తారు.
News April 25, 2025
విశాఖలో నేడు చంద్రమౌళి అంత్యక్రియలు

కశ్మీర్ ఉగ్రవాద దుర్ఘటనలో మృతి చెందిన చంద్రమౌళి అంత్యక్రియలు విశాఖలో శుక్రవారం ఉదయం 11.30 గంటలకు నిర్వహించనున్నారు. హోం మంత్రి వంగలపూడి అనిత, జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి బాల వీరాంజనేయులు ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. అధికార లాంఛనాలతో ఈ కార్యక్రమం జరగనుంది. ఇప్పటికే అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చంద్రమౌళి మృతదేహానికి గురువారం రాత్రి ఘన నివాళులర్పించారు.