News March 17, 2025
కూల్ డ్రింక్ అనుకొని పురుగు మందు తాగి వృద్ధురాలి మృతి..!

కూల్డ్రింక్ అనుకొని పురుగు మందు తాగి వృద్ధురాలు మృతిచెందిన ఘటన ముస్తాబాద్ మండలంలో చోటుచేసుకుంది. పోతుగల్కు చెందిన బాలవ్వ (85) శనివారం ఇంట్లోని పురుగు మందును డ్రింక్ అనుకొని తాగి అస్వస్థతకు గురైంది. కుటుంబీకులు ఆమెను సిద్దిపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అదేరోజు రాత్రి మరణించింది. కాగా, 25 రోజుల క్రితమే బాలవ్వ కొడుకు దేవయ్య పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
Similar News
News November 21, 2025
మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

<
News November 21, 2025
రంగేస్తున్నారా? ఇవి తెలుసుకోండి

గతంలో తెల్ల జుట్టు వస్తేనే రంగేసుకొనేవారు. కానీ ఇప్పుడు ఫ్యాషన్, ట్రెండ్ అంటూ రకరకాల రంగులతో జుట్టు స్వరూపాన్ని మార్చేస్తున్నారు. దీనికి ముందు కొన్ని టిప్స్ పాటించాలంటున్నారు నిపుణులు. చర్మ రంగుని బట్టి జుట్టు రంగును ఎంచుకోవాలి. రంగు మాత్రమె కాదు షేడ్ కూడా చూసుకోవాలి. లేదంటే జుట్టు, మీ అందం చెడిపోతాయి. మొదటిసారి రంగేస్తున్నట్లయితే వీలైనంత వరకు నిపుణులను సంప్రదించడం మంచిది.
News November 21, 2025
మార్గశిరం వచ్చేసింది.. ఈ వ్రతాలు చేస్తున్నారా?

విష్ణుమూర్తికి ప్రీతిపాత్రమైన మార్గశిర మాసంలో కొన్ని ముఖ్యమైన వ్రతాలను ఆచరిస్తారు. పెళ్లి కాని అమ్మాయిలు మంచి భర్త రావాలని కాత్యాయనీ వ్రతం చేస్తారు. గురువారాల్లో మార్గశిర లక్ష్మీవార వ్రతాన్ని చేస్తే రుణ సమస్యలు తొలగి, సంపద, ఆరోగ్యం కలుగుతాయని నమ్మకం. మనోధైర్యం, ధృడ సంకల్పం, దుష్ట గ్రహాల ప్రభావం నుంచి రక్షణ కోసం హనుమద్వ్రతం చేస్తారు. ☞ ఏ వ్రతం ఎప్పుడు, ఎలా చేయాలో తెలుసుకోవడానికి <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.


