News January 20, 2025

కూసుమంచి గణపేశ్వరాలయం చరిత్ర ఇదే..!

image

కూసుమంచి గణపేశ్వరాలయానికి వెయ్యేళ్ల చరిత్ర ఉంది. క్రీ.శ 11-12వ శతాబ్దంలోని కాకతీయుల కాలంలో వెయ్యిన్నొక్కటి శివాలయాల నిర్మాణ క్రమంలో గణపతి దేవుడు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు ప్రతీతి. ఈ ఆలయంలోని శివలింగం దక్షిణ భారతదేశంలో అతిపెద్ద శివలింగాల్లో ఒకటి. ఆలయ నిర్మాణం ఓ చేయి, కాలు లేని శిల్పి చేశాడనేది ప్రచారంలో ఉంది. ప్రతి శివరాత్రికి ఖమ్మంతో పాటు నల్గొండ, వరంగల్‌ జిల్లాల నుంచి భక్తులు ఇక్కడికి వస్తుంటారు.

Similar News

News February 8, 2025

ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} ఖమ్మంలో ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి పర్యటన∆} సత్తుపల్లిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం∆} ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన ∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు మార్కెట్‌కు వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం ∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన ∆}  మధిరలో అంతరాయం

News February 8, 2025

రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

image

<<15391662>>కర్మకు వెళ్లి వస్తుండగా<<>> బూడిదంపాడు వద్ద రోడ్డు ప్రమాదంలో వీరబాబు, విజయ్‌ మృతి చెందిన విషయం తెలిసిందే. విజయ్‌కు భార్య, 3 కుమారులు, వీరబాబుకు భార్య, ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. వీరబాబు మొదటి భార్యకు కుమార్తె జన్మించాక 8ఏళ్ల క్రితం కన్నుమూయడంతో మరో వివాహం చేసుకున్నాడు. కుమార్తెకు పెళ్లి నిశ్చయం కాగా ఇటీవలే ముహూర్తాలు కూడా ఖరారు చేసుకున్నారు. ఇంతలోనే ఆయన మృతి చెందడంతో కుటుంబంలో విషాదం నెలకొంది.

News February 7, 2025

ఖమ్మం: రుణ మంజూరులో వెనుకంజ..!

image

ఖమ్మం జిల్లా స్వయం సహాయక సంఘాలకు రుణ మంజూరు ప్రక్రియలో వెనుకంజలో ఉంది. మొత్తం 21,348 స్వయం సహాయక సంఘాలకు ఈ ఆర్థిక సంవత్సరం రూ.1,113.32 కోట్ల రుణాలు అందించాలని లక్ష్యంగా నిర్దేశించారు. డిసెంబర్, జనవరికల్లా ఈ లక్ష్యాన్ని పూర్తిచేయడం ఆనవాయితీ. కానీ ఫిబ్రవరి మొదటి వారం దాటుతున్నా 7,774 సంఘాలకు రూ.738.79 కోట్ల (66.36 శాతం) మేర మాత్రమే రుణం అందించగలిగారు.

error: Content is protected !!