News January 30, 2025

‘కృత్రిమమేథను అందిపుచ్చుకోవాలి’

image

అధునాతన పరిజ్ఞానాలు కృత్రిమమేథ(ఏఐ), ఆర్టిఫీషియల్ జనరల్ ఇంటెలిజెన్స్(ఏజీఐ)ను భారతీయులు సైతం అందిపుచ్చుకోవాలని బ్రిటన్, ఫెఫీల్డ్ విశ్వవిద్యాలయంలోని డిజిటల్ మీడియా అధ్యాపకురాలు డాక్టర్ ప్రీతి రఘునాథ్ అభిప్రాయపడ్డారు. అత్యంత ఖర్చు, వ్యయంతో కూడినదైనా దాన్ని వదులుకోకూడదన్నారు. ‘తెలంగాణలో కృత్రిమ మేథ విధానాలు, మౌలిక సదుపాయాలు, అభ్యాసాలు: ప్రారంభ ముద్రలు’ అనే అంశంపై గీతం వర్సిటీలో వారు ప్రసంగించారు.

Similar News

News November 6, 2025

పెద్దపల్లి: SC సంక్షేమ శాఖపై కలెక్టర్ సమీక్ష

image

PDPL కలెక్టర్ కోయ శ్రీహర్ష SC సంక్షేమ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వసతి గృహాలను పరిశుభ్రంగా ఉంచాలని, పిచ్చిమొక్కలు తొలగించి పారిశుధ్యాన్ని కాపాడాలన్నారు. మరమ్మతులు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. 10వ తరగతి విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించేలా ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. నాణ్యమైన ఆహారం, మెనూ అమలు, స్కాలర్షిప్ దరఖాస్తుల పెంపుపై అధికారులు దృష్టి పెట్టాలన్నారు.

News November 6, 2025

JNTUలో Way2News ఎఫెక్ట్

image

‘JNTU క్వార్టర్స్ ఖాళీ చేయాలని నోటీసులు.. పట్టించుకోని వైనం’ అని Way2Newsలో వచ్చిన కథనానికి ప్రభుత్వ యంత్రాంగం స్పందించింది. దీనిపై పూర్తి నివేదిక అందజేయాలని JNTUH అధికారులను కోరినట్లు సమాచారం. PhDలు పూర్తైనా వేరే వారికి అవకాశం ఇవ్వకుండా JNTUలో ఉంటూ పెత్తనాలు చేస్తున్న వారిపై చర్యలు చేపట్టేందుకు వర్సిటీ యంత్రాంగం సిద్ధమైనా.. కొందరు ప్రలోభాలు పెడుతూ ఆపేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.

News November 6, 2025

కృష్ణా: పంచారామాల బస్సులకు.. ఆన్‌లైన్ రిజర్వేషన్

image

పంచారామాలు, అరుణాచలం, విశిష్ఠ శైవ క్షేత్రాలు, అలాగే యాగంటి, మహానంది, శ్రీశైలం త్రిలింగ దర్శినికి RTC ప్రత్యేక బస్సులు నడుపుతోంది. నవంబర్ 8,9 తేదీల్లో అవనిగడ్డ, మచిలీపట్నం, గుడివాడ, గన్నవరం, ఉయ్యూరు డిపోల నుంచి శని, ఆదివారం రాత్రి స్పెషల్ సర్వీసులు నడవనున్నాయని RTC అధికారులు తెలిపారు. ప్రయాణికులు ONLINEలో ముందస్తు రిజర్వేషన్ చేసుకోవచ్చుని సూచించారు.