News March 13, 2026
కృష్ణాజిల్లాలో రేపు సెలవు రద్దు

కృష్ణా జిల్లాలోని విద్యా సంస్థలకు ఈ నెల 14న రెండో శనివారం శెలవు రద్దు చేసినట్టు జిల్లా విద్యాశాఖాధికారి యువీ సుబ్బారావు గురువారం తెలిపారు. మొంథా తుపాన్ సమయంలో కాంపస్ శాటరీ శెలవుల దృష్ట్యా ఈ శనివారం పాఠశాలలకు శెలవు దినం రద్దు చేసినట్లు వివరించారు. ఆ రోజు అన్ని విద్యా సంస్థలు యథావిధిగా కొనసాగుతాయన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించాలని డీఈఓ కోరారు.
Similar News
News April 13, 2026
కృష్ణా: బందరు ప్రజల గొంతెండుతోంది!

మచిలీపట్నం కార్పొరేషన్ పరిధిలో తాగునీటి సమస్య జటిలమవుతోంది. వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నా, నేతలు రాజకీయాల్లో మునిగితేలుతూ ప్రజల దాహాన్ని విస్మరిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. పోతేపల్లి, ఈడేపల్లి, బాలరామునిపేట, గిలకలదిండి, భాస్కరపురం వంటి ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. బోర్ల నుంచి వచ్చే ఉప్పునీరే దిక్కవడంతో, ప్రజలు బయట ప్రైవేట్ ప్లాంట్ల వద్ద నీటిని కొనుగోలు చేస్తున్నారు.
News April 11, 2026
కృష్ణా: పన్నుల వసూళ్లలో బందరు కార్పొరేషన్ పూర్!

మచిలీపట్నం కార్పొరేషన్లో పన్నుల వసూళ్లు నత్తనడకన సాగుతున్నాయి. రూ.39 కోట్ల లక్ష్యానికి గానూ కేవలం రూ.16 కోట్లే వసూలయ్యాయి. అక్రమ కట్టడాల కూల్చివేతపై చూపే ఉత్సాహం వసూళ్లలో కనిపించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. పొరుగున ఉన్న గుడివాడ మెరుగైన ఫలితాలు సాధించగా, జిల్లా కేంద్రం మాత్రం వెనుకబడింది. ఏప్రిల్ నెలాఖరు వరకు ఉన్న 50% వడ్డీ రాయితీతోనైనా అధికారులు బకాయిలు రాబడతారో లేదో చూడాలి.
News April 10, 2026
పెడనలో మట్టి మాఫియా బరితెగింపు!

పెడన నియోజకవర్గంలోని గూడూరు, కృత్తివెన్ను, బంటుమిల్లి మండలాల్లో మట్టి మాఫియా బరితెగిస్తోంది. చిన్నగొల్లపాలెం, కృత్తివెన్ను ప్రాంతాల నుంచి అక్రమంగా తవ్విన మట్టి ఏకంగా జిల్లాలు దాటుతోంది. గ్రామస్థులు అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. కొంకేపూడి-ఈదుముడి కనెక్టింగ్ బ్రిడ్జిపై నిత్యం వందలాది లారీలు తిరుగుతుండడంతో ఆ వంతెన బలహీనపడి కూలిపోయే స్థితికి చేరుకుంది.


