News February 21, 2025
కృష్ణాజిల్లా నేటి ముఖ్యాంశాలు

*కృష్ణా: డీజీపీకి లేఖ రాసిన పేర్ని నాని. *కృష్ణాజిల్లా పోలీసులను అభినందించిన హోంమంత్రి. *కృష్ణా జిల్లాలో మొదటి జీబీఎస్ కేసు. *అమలాపురం లాడ్జిలో పోరంకి డాక్టర్ మృతి. * ఉయ్యూరులో మద్యం మత్తులో వీరంగం. *కృష్ణా: APK ఫైల్ క్లిక్ చేస్తే బ్యాంకు ఖాతా ఖాళి. *గన్నవరం: వంశీ కేసులో పిటిషన్ వాయిదా.
Similar News
News October 16, 2025
కృష్ణా: బెల్ట్ షాపుల్లో మద్యం సురక్షితమేనా.?

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సురక్ష యాప్ ద్వారా వైన్ షాపులు, బార్లలో మద్యం సీసాల స్కానింగ్ సదుపాయం అందుబాటులో ఉంది. అయితే, బెల్ట్ షాపుల విషయంలో పరిస్థితి భిన్నంగా ఉందని మద్యం ప్రియులు అంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నిత్యం మద్యం విక్రయిస్తున్న ఈ బెల్ట్ షాపుల్లో అమ్ముతున్న సీసాలు అసలువో, నకిలీవో తెలుసుకునే అవకాశం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
News October 16, 2025
అంగలూరులో రాష్ట్రంలో మొట్టమొదటి బాలికల పాఠశాల

గుడ్లవల్లేరు అంగలూరు గ్రామంలో చల్లపల్లి జమిందార్ జ్ఞాపకార్థంగా బాలికల పాఠశాల ప్రారంభించారు. స్వాతంత్య్రం రాక ముందు బాలికలకు విద్య దూరంగా ఉండేది. దీంతో 1946లో ఈ స్కూల్ ప్రారంభించి బాలికా విద్యకు పునాది వేశారు. జమిందారీ దాతృత్వంతో 96 సంవత్సరాల అద్భుత ప్రయణం సాగుతోంది. రాష్ట్రంలోనే అత్యంత పురాతనమైన బాలికల ప్రభుత్వ పాఠశాలగా గుర్తింపు పొందింది. ఇటీవల జిల్లాస్థాయి స్వచ్ఛ పాఠశాల అవార్డు అందుకుంది.
News October 16, 2025
గన్నవరంలో యాక్సిడెంట్.. స్పాట్ డెడ్

గన్నవరం జాతీయ రహదారిపై గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ – ద్విచక్ర వాహనం ఢీ కొనడంతో బైకుపై ఉన్న వ్యక్తి మృతి చెందాడు. మృతుడు బాపులపాడు మండలానికి చెందిన గరికిపాటి సుబ్బారావుగా గుర్తించారు. అతను రైల్వే శాఖలో పని చేసి రిటైర్ అయ్యారు. మార్కెట్ నుంచి సరుకులకు తీసుకొని వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం.