News April 24, 2024
‘కృష్ణా’లో మెరుగుపడని స్థానం.. పెరిగిన ఉత్తీర్ణతా శాతం

పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో కృష్ణా జిల్లా స్థానం మెరుగు పడలేదు. గత సంవత్సరం మాదిరి ఈ సంవత్సరం కూడా 11వ స్థానానికే పరిమితమైంది. ఈ సంవత్సరం ఉత్తీర్ణతా శాతం పెరిగింది. గత సంవత్సరం 19,670 మంది విద్యార్థులకు 14,688 మంది ఉత్తీర్ణులవ్వగా ఉత్తీర్ణతా శాతం (74.67%) ఉత్తీర్ణులయ్యారు. ఈ సంవత్సరం 21,112 మంది విద్యార్థులకు 19,011 మంది (90.03%) పాస్ అయ్యారు. గత సంవత్సరం కంటే 16.26% ఉత్తీర్ణత పెరిగింది.
Similar News
News January 15, 2026
కృష్ణా: కోడి పందేలలో ఇవే కీలకం?

కోడి పందేల విషయంలో వారాలు, రంగులు, దిశలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉందని పందెం రాయుళ్లు విశ్వసిస్తున్నారు. ఆది, మంగళ డేగ, సోమ, శని నెమలి, బుధ, గురువారాల్లో కాకి. ఈ రోజుల్లో ఈ కోళ్లు గెలుపు సాధిస్తాయని అంచనా వేస్తున్నారు. అలాగే బరిలో కోడిని వదిలే దిశ కూడా కీలకమని చెబుతున్నారు. భోగి నాడు ఉత్తర దిశ, సంక్రాంతికి తూర్పు దిశ, కనుమ నాడు దక్షిణ దిశ నుంచి కోడిని దింపితే విజయం వరిస్తుందని శాస్త్రం చెబుతుందంట.
News January 14, 2026
కృష్ణా: కోడి పందేల ముసుగులో భారీగా గ్యాంబ్లింగ్!

జిల్లా వ్యాప్తంగా కోడి పందేల ముసుగులో భారీగా గ్యాంబ్లింగ్ కొనసాగుతోంది. గుడివాడ, కేసరపల్లి, ఈడుపుగల్లులో కోడి పందేల బరుల పక్కనే గ్యాంబ్లింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి, నిర్వాహకులు సందడి చేస్తున్నారు. కాయ్ రాజా కాయ్, నంబర్ గేమ్, గుండాట, మూడు ముక్కలాట వంటి ఆటలతో పందెం బాబులను ఆకర్షిస్తున్నారు. సరదాగా పందేలు చూడటానికి వచ్చిన వారు గ్యాంబ్లింగ్లోకి లాగబడి జేబులు ఖాళీ చేసుకుంటున్న పరిస్థితి నెలకొంది.
News January 12, 2026
సెమీ మెకనైజ్డ్ ఇసుక రీచ్లను గుర్తించండి: కలెక్టర్

భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని జిల్లాలో 24 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం జరిగింది. ఏప్రిల్ నుంచి మార్చ్ వరకు సెమీ మెకనైజ్డ్ కొత్త ఇసుక రీచ్లను గుర్తించాలన్నారు.


