News June 17, 2024

కృష్ణా: అడ్మిషన్లకు దరఖాస్తుకు రేపే ఆఖరు

image

నూజివీడులోని YSR హార్టికల్చర్ యూనివర్సిటీలో 2ఏళ్ల ఉద్యాన పాలిటెక్నిక్ కోర్సులో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదలైంది. SSC పాసైన విద్యార్థులు https://drysrhu.ap.gov.in/అధికారిక వెబ్‌సైట్‌లో జూన్ 18లోపు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ పి.విజయలక్ష్మి చెప్పారు. మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనుసరించి సీట్లు భర్తీ చేస్తామని ఆమె తెలిపారు.

Similar News

News October 3, 2024

VJA: ముంబై నటి కేసులో కీలక అప్డేట్

image

ముంబై నటి జెత్వానీ కేసులో తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ ఐపీఎస్ అధికారులతో పాటు పోలీస్ అధికారులు దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. ఈ నెల 15వ తేదీ వరకు తొందరపాటు చర్యలు వద్దని గతంలో ఇచ్చిన ఆదేశాలను న్యాయస్థానం పొడిగింపు చేసింది. ఇవే ఆదేశాలు కేసులో ముద్దాయిలుగా ఉన్న ఏసీపీ, సీఐలకు వర్తిస్తాయని హైకోర్టు పేర్కొంది.

News October 3, 2024

విజయవాడ దుర్గమ్మ బంగారు కిరీటాన్ని చూశారా

image

విజయవాడ కనకదుర్గమ్మకు ఒక అజ్ఞాత భక్తుడు ఇటీవల బంగారు కిరీటాన్ని అందజేశారు. రూ.2.5 కోట్లతో బంగారం, వజ్రాలతో తయారు చేసిన ఈ కిరీటాన్ని గురువారం కనకదుర్గమ్మ వారికి అర్చకులు అలంకరించారు. బాలా త్రిపుర సుందరి దేవిగా నేడు అలంకరించిన కనకదుర్గమ్మ అమ్మవారు ఈ కిరీటంతో భక్తులకు దర్శనమిస్తారని ఆలయ అర్చకులు చెప్పారు.

News October 3, 2024

17 గ్రామాలలో అభివృద్ధి పనులు చేస్తాం: కలెక్టర్

image

పీఎం జనజాతీయ ఉన్నత గ్రామఅభియాన్(పీఎం జుగా) పథకంలో ఎన్టీఆర్ జిల్లాలోని 5 మండలాల్లో ఉన్న 17 గ్రామాలలో అభివృద్ధి పనులు చేస్తామని కలెక్టర్ జి.సృజన తెలిపారు. ఈ గ్రామాలలో గిరిజన జనాభా ఎక్కువ ఉన్నందున ఈ పథకం అమలవుతుందని ఆమె తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ పథకంలో స్వయం ఉపాధి కల్పన, నైపుణ్య శిక్షణ, విద్యా, మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు చేస్తామన్నారు.