News June 19, 2024
కృష్ణా: అనుమానాస్పద స్థితిలో రైతు మృతి
పెడన మండలంలోని కొంకేపూడికి చెందిన రైతు శ్రీనివాసరావు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. మృతుడు శ్రీనివాసరావుకి సుబ్బారావు, వెంకటేశ్వరరావుల మధ్య పొలం హక్కుల విషయమై విభేదాలు ఉన్నాయి. ఈ క్రమంలో వీరి మధ్య వివాదం జరిగింది. మనస్తాపం చెందిన శ్రీనివాసరావు ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News October 4, 2024
విజయవాడలో డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్
విజయవాడ నగరంలో అత్యంత రద్దీ ప్రాంతమైన రామవరప్పాడు రింగ్-మహానాడు రోడ్డు వద్ద డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. బెంగళూరులో ఇటీవల నిర్మించిన ఈ తరహా ఫ్లైఓవర్ మాదిరిగా 6.5కి.మీ. మేర మహానాడు రోడ్డు-నిడమానూరు వరకు ఈ ఫ్లైఓవర్ నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ఈ ఫ్లైఓవర్లో ఎలివేటెడ్ మెట్రో కారిడార్ సైతం నిర్మించనున్నట్లు సమాచారం.
News October 3, 2024
తిరువూరు: శావల దేవదత్కు శుభాకాంక్షల వెల్లువ
తిరువూరు నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జ్ టీడీపీ నేత శావల దేవదత్ గురువారం స్థానిక నియోజకవర్గ పార్టీ కార్యాలయాన్ని పున:ప్రారంభించారు. ఎమ్మెల్యే కొలికపూడి వివాదం నేపథ్యంలో తిరువూరు నియోజకవర్గ బాధ్యతలు దేవదత్కు అప్పగిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన పార్టీ శ్రేణులు పార్టీ కార్యాలయానికి అధిక సంఖ్యలో చేరుకుని శుభాకాంక్షలు తెలియజేశారు.
News October 3, 2024
VJA: ముంబై నటి కేసులో కీలక అప్డేట్
ముంబై నటి జెత్వానీ కేసులో తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ ఐపీఎస్ అధికారులతో పాటు పోలీస్ అధికారులు దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. ఈ నెల 15వ తేదీ వరకు తొందరపాటు చర్యలు వద్దని గతంలో ఇచ్చిన ఆదేశాలను న్యాయస్థానం పొడిగింపు చేసింది. ఇవే ఆదేశాలు కేసులో ముద్దాయిలుగా ఉన్న ఏసీపీ, సీఐలకు వర్తిస్తాయని హైకోర్టు పేర్కొంది.