News January 10, 2025

కృష్ణా: అలర్ట్.. పరీక్షల టైం టేబుల్ విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(ANU) పరిధిలోని కళాశాలల్లో బీఈడీ కోర్సు చదివే విద్యార్థులు రాయాల్సిన 3వ సెమిస్టర్ రెగ్యులర్&సప్లిమెంటరీ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. ఫిబ్రవరి 3,4,5,6,7 తేదీలలో ఉదయం 10 నుంచి 11.30 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. టైం టేబుల్ పూర్తి వివరాలకై https://www.nagarjunauniversity.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చూడవచ్చు. 

Similar News

News October 27, 2025

కృష్ణా: మెంథా తుఫాన్.. ప్రత్యేక అధికారులు జాబితా ఇదే.!

image

మచిలీపట్నం-7093930106, అవనిగడ్డ-9704701900, కోడూరు-9490952125, నాగయలంక-8639226587, చల్లపల్లి-9100084656, కృత్తివెన్ను-8331056798, మోపిదేవి-8008772233, బంటుమిల్లి-9100109179, ఘంటసాల-9848933877, గూడూరు-9849588941, పెడన-9154409536, బాపులపాడు-9849906009, గన్నవరం-8333991288, గుడివాడ-8686935686, గుడ్లవల్లేరు-9052852666, తోట్లవల్లూరు-9492555104, ఉయ్యూరు-7995086773, నందివాడ-9989092288.

News October 27, 2025

కృష్ణా: తీరప్రాంత ప్రజలకు మడ అడవులు రక్షణ కవచం.!

image

ప్రకృతి విపత్తుల నుంచి తీరప్రాంత ప్రజలకు రక్షణ కవచంలా మడ అడవులు వ్యవహరిస్తున్నాయి. అలాంటి సహజ సంపద నేడు అంతరించిపోతున్న స్థితికి చేరుకోవడంతో తీరప్రాంత ప్రజల్లో ఆందోళన నెలకొంది. 1977లో దివిసీమ ఉప్పెన సమయంలో మడ అడవులు ఉన్న ప్రాంతాల్లో విపత్తు ప్రభావం తక్కువగా కనిపించిందని, అదేవిధంగా 2004 సునామీ సమయంలో కూడా ఈ మడ అడవులే సహజ రక్షణగా నిలిచాయని విపత్తు నిర్వహణ శాఖ అధికారులు గుర్తు చేస్తున్నారు.

News October 27, 2025

కృష్ణా: తుపాన్ బీభత్సం.. చిగురుటాకులా వణికిన దివిసీమ

image

‘మొంథా’ తుపాన్ ప్రభావం వల్ల దివిసీమ ప్రజలు కలవరపడుతున్నారు. గతంలో కృష్ణా జిల్లాను కకావికలం చేసిన 1977 తుపానును గుర్తుచేసుకుంటున్నారు. దీంతో దివిసీమ చిగురుటాకులా వణుకుతోంది. ఆ సంవత్సరం నవంబర్‌ 19న తుపాను భారతదేశపు తూర్పు సముద్రతీరాన్ని తాకింది. అధికారికంగా 14,204, అనధికారికంగా సుమారు 50 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది ఇళ్లు నేలమట్టం అయ్యాయి. కొన్ని ఊర్లు సముద్రంలో కలిసిపోయాయి.