News April 2, 2024
కృష్ణా : ఆ స్థానాలకు ఖరారు కాని కాంగ్రెస్ అభ్యర్థులు

ఉమ్మడి కృష్ణాజిల్లాకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. మొత్తం 16 MLA స్థానాలకు గాను 11 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. విజయవాడ పశ్చిమ, సెంట్రల్, తూర్పు, గన్నవరం, జగ్గయ్యపేట నియోజకవర్గాలతో పాటు మచిలీపట్నం, విజయవాడ పార్లమెంట్ స్థానాలను పెండింగ్లో పెట్టారు. త్వరలోనే ఈ స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటిస్తారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
Similar News
News April 11, 2026
కృష్ణా: పన్నుల వసూళ్లలో బందరు కార్పొరేషన్ పూర్!

మచిలీపట్నం కార్పొరేషన్లో పన్నుల వసూళ్లు నత్తనడకన సాగుతున్నాయి. రూ.39 కోట్ల లక్ష్యానికి గానూ కేవలం రూ.16 కోట్లే వసూలయ్యాయి. అక్రమ కట్టడాల కూల్చివేతపై చూపే ఉత్సాహం వసూళ్లలో కనిపించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. పొరుగున ఉన్న గుడివాడ మెరుగైన ఫలితాలు సాధించగా, జిల్లా కేంద్రం మాత్రం వెనుకబడింది. ఏప్రిల్ నెలాఖరు వరకు ఉన్న 50% వడ్డీ రాయితీతోనైనా అధికారులు బకాయిలు రాబడతారో లేదో చూడాలి.
News April 10, 2026
పెడనలో మట్టి మాఫియా బరితెగింపు!

పెడన నియోజకవర్గంలోని గూడూరు, కృత్తివెన్ను, బంటుమిల్లి మండలాల్లో మట్టి మాఫియా బరితెగిస్తోంది. చిన్నగొల్లపాలెం, కృత్తివెన్ను ప్రాంతాల నుంచి అక్రమంగా తవ్విన మట్టి ఏకంగా జిల్లాలు దాటుతోంది. గ్రామస్థులు అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. కొంకేపూడి-ఈదుముడి కనెక్టింగ్ బ్రిడ్జిపై నిత్యం వందలాది లారీలు తిరుగుతుండడంతో ఆ వంతెన బలహీనపడి కూలిపోయే స్థితికి చేరుకుంది.
News April 10, 2026
రక్తదానం ప్రాణదానంతో సమానమనం: కలెక్టర్ బాలాజీ

మచిలీపట్నంలో ‘సర్వే డే’ పురస్కరించుకొని నిర్వహించిన రక్తదాన శిబిరంలో కలెక్టర్ డీకే బాలాజీ, జాయింట్ కలెక్టర్ నవీన్ స్వయంగా రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని, అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానం చేశారు.


