News March 1, 2025
కృష్ణా: ఇంటర్ ఫస్టియర్ తొలిరోజు పరీక్షకు 98.03% హాజరు

ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షలు జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైనట్టు జిల్లా ఇంటర్మీడియట్ బోర్డు విద్యాశాఖాధికారి పీబీ సాల్మన్ రాజు తెలిపారు. తొలిరోజు పరీక్షకు 98.03% మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. మొత్తం 24,810 మందికి గాను 24,323 మంది పరీక్షకు హాజరయ్యారని, 487 మంది గైర్హాజరయ్యారన్నారు. ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కేసులు జిల్లాలో నమోదు కాలేదన్నారు.
Similar News
News March 2, 2025
గన్నవరం: ఎమ్మెల్యే యార్లగడ్డ దృష్టికి సమస్యలు

గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావును విజయవాడ కార్యాలయంలో నియోజకవర్గంలోని పలు గ్రామాల ప్రజలు, నాయకులు కలిశారు. ఈ సందర్భంగా వారు స్థానిక సమస్యలను వివరించగా, ఆయన వాటిని త్వరలోనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు. అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామని ఆయన పేర్కొన్నారు.
News March 1, 2025
కృష్ణాజిల్లా టుడే టాప్ న్యూస్

కృష్ణాజిల్లాలో నేటి ముఖ్యంశాలు * కృష్ణా జిల్లాలో ఇంటర్ మొదటి రోజు పరీక్షకు 98.03% హాజరు* విజయవాడలో పిల్లలను విక్రయిస్తున్న ముఠా అరెస్ట్ * కృష్ణా: ప్రజలపై బాలకృష్ణ ఆగ్రహం..YCP రియాక్షన్ * కృష్ణా: అమల్లోకి కొత్త ట్రాఫిక్ రూల్స్ * కృష్ణ విశ్వవిద్యాలయం ఇన్చార్జి రిజిస్టర్గా ఆచార్య ఉష * కృష్ణా జిల్లా వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ
News March 1, 2025
కృష్ణా: ప్రజలపై బాలకృష్ణ ఆగ్రహం.. YCP రియాక్షన్

కృష్ణా జిల్లా నిమ్మకూరులో ప్రజలపై సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దీనిపై వైసీపీ X వేదికగా స్పందించింది. ‘ఎంత అవివేకం ఎంత కుసంస్కారం నీకు బాలయ్య.?’ అని పోస్ట్ చేసి బాలకృష్ణ గ్రామస్థులతో ఉన్న వీడియోను వైసీపీ జత చేసింది.