News February 10, 2025

కృష్ణా: ‘ఇంటికి రమ్మని చెప్పి.. అఘాయిత్యం’

image

కంచికచర్లలో విద్యార్థినిని బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారం చేసిన ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. బీటెక్ చదువుతున్న విద్యార్థిని హుస్సేన్‌, ప్రేమించుకున్నారు. హుస్సేను ఆమెను ఇంటికి రమ్మని పిలిచి తన స్నేహితులను రప్పించి బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారం చేశారు. అరుపులు వినపడకుండా టీవీ సౌండ్ పెట్టారు. ఎవరికైనా చెప్తే వీడియోలు బయటపెడతామన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులను అరెస్ట్ చేశారు.

Similar News

News March 24, 2025

MTM: పెండింగ్ అర్జీలను పరిష్కరించాలి – కలెక్టర్

image

మీకోసం కార్యక్రమంలో వచ్చిన అర్జీలను సత్వరం పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం మచిలీపట్నం కలెక్టరేట్ మీటింగ్ హాలులో నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఇప్పటి వరకు 19,839 అర్జీలు అందగా అందులో ఇంకా 2,235 అర్జీలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. వీటిని సత్వరం పరిష్కరించాలన్నారు.

News March 24, 2025

కృష్ణాజిల్లాలో పదో తరగతి గణితం పరీక్ష ప్రశాంతం

image

కృష్ణాజిల్లా వ్యాప్తంగా సోమవారం నిర్వహించిన పదో తరగతి గణితం పరీక్ష ప్రశాంతంగా జరిగిందని డీఈఓ పీవీజే రామారావు తెలిపారు. జిల్లాలో 21,771 మంది విద్యార్థులకు గాను 21,419 మంది విద్యార్థులకు పరీక్షలకు హాజరయ్యారన్నారు. జిల్లాలో ఎక్కడా మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు కాలేదన్నారు. విద్యార్థులు కాపీయింగ్‌కు పాల్పడితే చర్యలు తీసుకుంటామన్నారు.

News March 24, 2025

తాడేపల్లిలో పామర్రు మహిళ దారుణ హత్య

image

ఎన్టీఆర్ జిల్లా తాడేపల్లి కొలనుకొండ వద్ద ఆదివారం రాత్రి నిర్మానుష్య ప్రాంతంలో వివాహిత దారుణ హత్యకు గురైన విషయం తెలిసినదే. మృతురాలు కృష్ణాజిల్లా పామర్రుకు చెందిన సజ్జా లక్ష్మీ తిరుపతమ్మగా పోలీసులు గుర్తించారు. మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె భర్త మృతి చెందడంతో కుటుంబ పోషణ భారమై క్యాటరింగ్ పనులకు వెళ్తోంది. లక్షీ తిరుపతమ్మ ఆదివారం విజయవాడలో క్యాటరింగ్ పనికి వెళ్తున్న క్రమంలో హత్యకు గురైంది.

error: Content is protected !!