News January 19, 2025
కృష్ణా: ఈ నెల 27తో ముగియనున్న ఫీజు చెల్లింపు గడువు

కృష్ణా యూనివర్శిటీ(KRU) పరిధిలోని కాలేజీలలో BA.LLB కోర్సులు(2024- 25 అకడమిక్ ఇయర్) చదివే విద్యార్థులు రాయాల్సిన 3వ సెమిస్టర్(Y19 నుండి Y23 బ్యాచ్లు) రెగ్యులర్ & సప్లిమెంటరీ థియరీ పరీక్షలను ఫిబ్రవరి 10 నుంచి నిర్వహిస్తామని KRU వర్గాలు తెలిపాయి. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఈ నెల 27లోపు ఫైన్ లేకుండా ఫీజు చెల్లించాలని, వివరాలకు https://kru.ac.in అధికారిక వెబ్సైట్ చెక్ చేసుకోవాలని సూచించింది.
Similar News
News February 18, 2025
కృష్ణా: డిగ్రీ పరీక్షల టైం టేబుల్ విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(ANU) పరిధిలో బీఏ(మల్టీమీడియా) కోర్స్ విద్యార్థులు రాయాల్సిన 7వ సెమిస్టర్ థియరీ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 1, 3, 4,5 తేదీలలో ఈ పరీక్షలు జరుగుతాయని ANU పరీక్షల విభాగ కంట్రోలర్ తాజాగా ఓ ప్రకటనలో తెలిపారు. టైం టేబుల్ పూర్తి వివరాలకు https://www.nagarjunauniversity.ac.in/ వెబ్సైట్ చూడాలని సూచించారు.
News February 17, 2025
గన్నవరం: రేపు వల్లభనేని వంశీని కలవనున్న జగన్?

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని రేపు మాజీ సీఎం వైఎస్ జగన్ కలవనున్నట్లు తెలిసింది. బెంగళూరు నుంచి నేరుగా ఆయన గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం రోడ్డు మార్గంలో విజయవాడ వెళ్ళనున్నారు. విజయవాడ సబ్ జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని జగన్ పరామర్శించినట్లు సమాచారం. ఇటీవల వల్లభనేని వంశీ అరెస్టై రిమాండ్లో ఉన్న విషయం తెలిసిందే.
News February 17, 2025
తోట్లవల్లూరు: ‘రేడియం స్టిక్కర్లు లేక ప్రమాదాలు’

తోట్లవల్లూరుల్లో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కండక్టర్ మృతి చెందిన విషయం తెలిసిందే. బైక్ మీద వెళ్తూ ఎడ్ల బండిని ఢీకొట్టడంతో స్పాట్లోనే మృతి చెందారు. ఎడ్ల బండ్లకు వెనుక రేడియం స్టిక్కర్స్ అంటించకపోవడంతో తరచు ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇదే ప్రాంతంలో ఈ తరహా ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందినట్లు పేర్కొంటున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.