News March 12, 2025

కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణించే రూట్‌లో మార్పులు 

image

విజయవాడ, కొండపల్లి మీదుగా తిరుపతి(TPTY)- ఆదిలాబాద్(ADB) మధ్య ప్రయాణించే కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణించే రూట్‌లో రైల్వే శాఖ మార్పులు చేసింది. సికింద్రాబాద్ స్టేషన్‌లో అభివృద్ధి పనులు చేస్తున్నందున నం.17405 TPTY- ADB రైలు ఈ నెల 26, నం.17406 ADB- TPTY రైలు ఈ నెల 27 నుంచి ఆ స్టేషన్లలో ఆగదని రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ రైళ్లను పై తేదీల నుంచి చర్లపల్లి మీదుగా నడుపుతున్నామన్నారు.

Similar News

News March 13, 2025

సిద్దిపేట: రాయితీని సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

image

జిల్లాలో ఎల్ఆర్ఎస్ ప్రక్రియలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 25% రాయితీని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం.మను చౌదరీ జిల్లా ప్రజలకు తెలిపారు. బుదవారం బుధవారం జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో అన్ని మున్సిపాలిటీల కమిషనర్లు, తహశీల్దార్, ఎంపీఓ, ఎంపీడీఓ, ఎంపీడీవో, ఔట్ యజమానులతో అందరితో నిర్వహించిన ఎల్ఆర్ఎస్-2020 పైన అవగాహన కల్పించారు.

News March 13, 2025

ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటుకు ఉత్తర్వులు

image

TG: ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 765.28 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో దీనిని ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. ఈ అథారిటీ ఛైర్మన్‌గా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరించనున్నారు. దీని పరిధిలో 56 రెవెన్యూ గ్రామాలు, 7 మండలాలు రానున్నాయి. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్‌‌కు ధీటుగా దీనిని ప్రభుత్వం ఫోర్త్ సిటీగా అభివర్ణిస్తోంది.

News March 13, 2025

వెంకటాపూర్: Way2Newsకు స్పందన

image

“రామప్ప ప్రధాన కాలువకు బుంగ ” శీర్షికన ఈనెల 10న <<15710154 >>Way2Newsలో ప్రచురితమైన<<>> కథనానికి ములుగు జిల్లా నీటిపారుల శాఖ అధికారులు స్పందించారు. వెంకటాపూర్ మండలం పాలంపేటలోని రామప్ప ప్రధాన కాలువ ఐన ఒగరు కాలువ గండిని బుధవారం పూడ్చివేశారు. అనంతరం ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు. దీంతో ఆయకట్టు రైతులు Way2Newsకు కృతజ్ఞతలు తెలిపారు.

error: Content is protected !!