News February 12, 2025
కృష్ణా: ఎమ్మెల్సీ ఎన్నికలకు 77 పోలింగ్ కేంద్రాలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739369680529_60300469-normal-WIFI.webp)
కృష్ణా – గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఫిబ్రవరి 27న నిర్వహించే పోలింగ్కు సంబంధించి ప్రిసైడింగ్ అధికారులు, పోలింగ్ అధికారులకు జిల్లా పరిషత్ కన్వెన్షన్ సెంటర్లో శిక్షణా తరగతులు నిర్వహించారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డీ.కే. బాలాజీ మాట్లాడుతూ.. స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణలో Polling staff కీలక పాత్ర వహించాలన్నారు. జిల్లాలో 77 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.
Similar News
News February 13, 2025
మచిలీపట్నం: టీ దుకాణదారుడిపై కలెక్టర్ ఆగ్రహం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739419219079_51768855-normal-WIFI.webp)
మచిలీపట్నంలోని ఓ టీ దుకాణదారుడిపై కలెక్టర్ డీకే బాలాజీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలో పారిశుద్ధ్య చర్యలను పర్యవేక్షిస్తున్న కలెక్టర్ గురువారం ఉదయం స్థానిక మూడు స్థంభాల సెంటర్లో పర్యటించారు. సర్వీస్ రోడ్డులో ఉన్న ఓ టీ దుకాణం ముందు తాగేసిన టీ గ్లాసులు ఎడాపెడా పడేసి ఉండటాన్ని గమనించిన కలెక్టర్ ఆ దుకాణదారుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డస్ట్ బిన్లో వేయించడం తెలియదా.?’ అంటూ ఫైర్ అయ్యారు.
News February 13, 2025
గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి.. నేడు నిందితుల బెయిల్పై తీర్పు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739412840040_934-normal-WIFI.webp)
టీడీపీ గన్నవరం నియోజకవర్గ కార్యాలయంపై దాడి కేసులో నిందితుల బెయిల్పై ఇవాళ తీర్పు వెలువడనుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని తాజాగా అరెస్ట్ చేశారు. కేసులో 88 మందిని నిందితులుగా చేర్చగా ఇప్పటికే 45మందిని అరెస్ట్ చేశారు. కాగా ఫిర్యాదుదారుడు సత్యవర్దన్ తనకు ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేదని, భయపెట్టి ఫిర్యాదు చేయించారని సోమవారం న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం ఇచ్చిన సంగతి తెలిసిందే.
News February 13, 2025
అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి: కలెక్టర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739361118380_51768855-normal-WIFI.webp)
ఈ నెల 27న MLC ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ప్రిసైడింగ్, పోలింగ్ అధికారులుగా నియమితులైన వారు బాధ్యతగా తమ విధులు నిర్వర్తించాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కోరారు. బుధవారం జడ్పీ కన్వెన్షన్ సెంటర్లో ప్రిసైడింగ్, పోలింగ్ అధికారులకు ఒక రోజు శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హ్యాండ్బుక్ను క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకోవాలన్నారు.