News February 7, 2025

కృష్ణా: కుంభమేళా వెళ్లిన మంత్రి, ఎమ్మెల్యేలు

image

కృష్ణా జిల్లా టీడీపీ నాయకులు మహా కుంభమేళా వెళ్లారు. శుక్రవారం ఉదయం బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో ప్రయాగ్ రాజ్‌కు చేరుకున్నారు. మంత్రి కొల్లు రవీంద్ర, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్, ఆధ్యాత్మికవేత్త బాలకృష్ణ గురూజీ మహా కుంభమేళా పవిత్ర స్నానానికి వెళ్లారు. 

Similar News

News February 7, 2025

ఆత్కూరులో మైనర్ బాలిక సూసైడ్

image

ఉంగుటూరు మండలం ఆత్కూరులో శుక్రవారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పాఠశాలకు సరిగ్గా వెళ్లటం లేదని తల్లి మందలించడంతో 15 ఏళ్ల బాలిక మనస్తాపం చెంది యాసిడ్ తాగింది. దీంతో బాలిక తీవ్ర అస్వస్థతకు గురైంది. కుటుంబ సభ్యులు గన్నవరం ఆసుపత్రికి, అక్కడి నుంచి విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ తెల్లవారుజామున మరణించింది. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు.

News February 7, 2025

పలు సమస్యలపై పార్లమెంట్‌‌లో మాట్లాడిన ఎంపీ బాలశౌరి 

image

మచిలీపట్నం ఎంపీ బాలశౌరి గురువారం పార్లమెంట్లో మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లాలో కొన్ని సమస్యలను కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌కు వివరించారు. జిల్లాలో గుడివాడలో కేటీఆర్ కళాశాల, గిలకలదిండి, మెడికల్ కళాశాల, బందర్‌‌లోని చిలకలపూడి, పెడన్ మెయిన్ రోడ్, ఉప్పులూరు, గూడవల్లి, నిడమానూరు, గుడ్లవల్లేరు, రామవరప్పాడు వద్ద ROB, RUBలను నిర్మించి ట్రాఫిక్‌కు చెక్ పెట్టాలని కేంద్రమంత్రిని కోరారు.   

News February 7, 2025

రోడ్డు ప్రమాదంలో కృష్ణా జిల్లా వాసులు మృతి

image

ప.గో జిల్లా ఉంగుటూరు మండలం నాచుగుంట వద్ద జాతీయ రహదారిపై గురువారం జరిగిన <<15374910>>రోడ్డు ప్రమాదంలో<<>> ఇద్దరు చనిపోయారు. మృతులు కృష్ణా(D) బాపులపాడు మండలం ఆరుగొలనుకు చెందిన దేవ మందిరం, విజయ్ బాబుగా గుర్తించారు. రెక్కాడితే కానీ డొక్కాడని ఆ కుటుంబాల్లో వీరి మరణం తీవ్ర విషాదాన్ని నింపింది. దేవ మందిరానికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. విజయ్‌బాబుకి భార్య, ఐటీఐ చదివే కుమారుడు, టెన్త్ చదువుతున్న కుమార్తె ఉన్నారు.

error: Content is protected !!