News January 30, 2025

కృష్ణా: ఘోర ప్రమాదం.. ముగ్గురు యువకులు స్పాట్ డెడ్ 

image

మచిలీపట్నం-నరసాపురం 216 జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృత్యువాత పడిన ఘటన పెడనలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ ద్విచక్ర వాహనంపై వస్తున్న యువకులను లారీ ఒక్కసారిగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. 

Similar News

News December 24, 2025

జహీరాబాద్‌: మాజీ సబ్‌ రిజిస్ట్రార్‌, కమిషనర్‌పై కేసు నమోదు

image

భూవివాదంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అప్పటి సబ్‌ రిజిస్ట్రార్‌ అబ్దుల్ హఫీజ్, మున్సిపల్ కమిషనర్ ఉమామహేశ్వరరావుపై కేసు నమోదు చేసినట్లు పట్టణ SI వినయ్ కుమార్ తెలిపారు. 2018లో ZHBకు చెందిన నరసింహారెడ్డి, వేణుగోపాల్‌తో కలిసి HYDకు చెందిన వినోబా ఓ వెంచర్ ఏర్పాటు చేశారు. అయితే రూల్స్ ఉల్లంఘించి ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసి తనను మోసం చేశారని బాధితుడి ఫిర్యాదుతో అధికారులు సహానలుగురిపై కేసు నమోదైంది.

News December 24, 2025

రణస్థలం: మనస్తాపంతో వ్యక్తి సూసైడ్

image

గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడుతూ ఆత్మహత్య చేసుకున్న ఘటన రణస్థలంలోని పైడిభీమవరంలో చోటుచేసుకుంది. ఎస్సై చిరంజీవి తెలిపిన వివరాల మేరకు సీహెచ్ పురుషోత్తం ఆచారి (52) విరేచనాల మందు, సెంటు కలుపుకుని తాగి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. కొంతకాలంగా గుండె వ్యాధితో బాధపడి, మనస్తాపానికి గురయ్యాడన్నారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

News December 24, 2025

BELలో అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తుకు రేపే ఆఖరు తేదీ

image

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (<>BEL<<>>) ఘజియాబాద్‌లో 84 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. బీటెక్, BE ఉత్తీర్ణులైన వారు NATS పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 25ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైనవారికి నెలకు స్టైపెండ్ రూ.17,500 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://bel-india.in