News March 20, 2025
కృష్ణా జిల్లాలో ఇద్దరు ఇన్విజిలేటర్లు సస్పెండ్

పదో తరగతి పరీక్షల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన తాడిగడప ఎంపీపీ ఎస్ మెయిన్ పాఠశాల ఇన్విజిలేటర్ను డీఈవో రామారావు సస్పెండ్ చేశారు. గైర్హాజరైన విద్యార్థి స్థానంలో మరొకరు పరీక్ష రాయడాన్ని గమనించకుండా బాధ్యతా రహితంగా వ్యవహరించడంతో ఈ చర్య తీసుకున్నారు. కంకిపాడులో ప్రశ్నపత్రం మార్పిడి ఘటనలో మరో ఇన్విజిలేటర్ను కూడా సస్పెండ్ చేశారు.
Similar News
News April 24, 2025
మైలవరం: బాలికపై లైంగిక దాడి.. పోక్సో కేసు నమోదు

మైలవరానికి చెందిన యువకుడు అవినాశ్ తెనాలిలో ఏడవ తరగతి చదువుతున్న బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. తెనాలి వన్ టౌన్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఓ ప్రైవేటు స్కూల్లో 7వ తరగతి చదువుతున్న బాలికకు అవినాశ్ ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యాడు. ఇటీవల తెనాలి వచ్చిన అతడు బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక ప్రవర్తనలో మార్పు గమనించిన తల్లిదండ్రులు ఆరా తీసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
News April 24, 2025
వత్సవాయి: తమ్ముడిని చంపిన అన్న

వత్సవాయి మండలం కాకరవాయిలో దారుణం చోటు చేసుకుంది. బుధవారం రాత్రి అన్నదమ్ముల మధ్య ఘర్షణ జరగగా, అన్న కొండ ఇనుప రాడ్డుతో తమ్ముడు అర్జున్ తలపై బలంగా కొట్టాడు. తీవ్రంగా గాయపడిన అర్జున్ను విజయవాడ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. నిందితుడు కొండను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
News April 24, 2025
గుడివాడ: వైసీపీకి హనుమంతరావు రాజీనామా..?

వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మండలి హనుమంతరావు రాజీనామా చేస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. పార్టీ ఆవిర్భావం నుంచి కీలక నేతగా ఉన్న ఆయన, కూటమి అక్రమాలపై కలెక్టర్కు వినతి కార్యక్రమంలో పాల్గొనకపోవడం చర్చనీయాంశమైంది. ఆయన బాటలోనే మరికొందరు నేతలు రాజీనామాకు సిద్ధమైనట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మండలి హనుమంతరావు నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.