News February 20, 2025

కృష్ణా జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

1. MLC ఓటు చెక్ చేసుకోండి ఇలా. 2. గన్నవరం: బాలికల మిస్సింగ్.. ఛేదించిన పోలీసులు3. మచిలీపట్నం బ్యాంకులో దొంగతనం4. మచిలీపట్నం: ఉద్యోగం నుంచి ప్రిన్సిపల్ తొలగింపు5. గుడివాడ: విద్యార్థులతో కలెక్టర్ ముఖాముఖి 6. M.Tech 1st సెమిస్టర్ టైం టేబుల్ విడుదల 7. గన్నవరం టీడీపీ ఆఫీస్ దాడి కేసులో వంశీకి షాక్8. జిల్లా వ్యాప్తంగా MLC ఎన్నికల ప్రచారం9. డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ కేంద్రాల పరిశీలన 

Similar News

News March 18, 2025

కృష్ణా: లబ్ధిదారుల పురోభివృద్ధికి తోడ్పడండి: కలెక్టర్

image

లబ్ధిదారులకు విరివిగా రుణాలు అందించి వారి పురోభివృద్ధికి తోడ్పడాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ బ్యాంకర్లను ఆదేశించారు. మంగళవారం మధ్యాహ్నం కలెక్టరేట్ మీటింగ్ హాలులో జిల్లా బ్యాంకర్ల సంప్రదింపుల సమితి సమావేశం కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. పంట సాగు చేస్తూ సీసీఆర్సీ కార్డులు కలిగిన కౌలు రైతులకు వారి పంట మీద తప్పనిసరిగా రుణాలు అందించాలని సూచించారు.

News March 18, 2025

కృష్ణా: పరిశ్రమల ఏర్పాటుకు తక్షణ అనుమతులు- కలెక్టర్

image

కృష్ణా జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చే ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు సంబంధించిన అనుమతులను సింగిల్ విండో పద్ధతిలో తక్షణమే మంజూరు చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక మండలి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అజెండాలోని అంశాలు, పెండింగ్ దరఖాస్తుల పురోగతి, సమస్యలు తదితర అంశాలపై చర్చించారు.

News March 18, 2025

రేపు కృష్ణా జిల్లాకు రానున్న మంత్రి నారా లోకేశ్

image

కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లిలో ఆగిపోయిన అశోక్ లేలాండ్ ప్లాంట్‌కు కొత్త జీవం పోసేందుకు మంత్రి నారా లోకేశ్ బుధవారం జిల్లాకు రానున్నారు. ఈ మెగా ప్రాజెక్ట్ ద్వారా 45,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నట్లు పలువురు అధికారులుు పేర్కొన్నారు. కొన్నేళ్లుగా నిరీక్షణలో ఉన్న స్థానికులకు ఇది వరంలాంటిదన్నారు. ఈ ప్లాంట్ ప్రారంభంతో మల్లవల్లి పారిశ్రామిక హబ్‌గా ముందడుగు వేయనున్నట్లు తెలిపారు.

error: Content is protected !!