News August 23, 2024

కృష్ణా జిల్లాలో ప్రారంభమైన గ్రామసభలు

image

మహాత్మ గాంధి జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేపట్టబోయే పనులపై కృష్ణా జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు ప్రారంభమయ్యాయి. బందరు మండలం భోగిరెడ్డిపల్లి గ్రామంలో జరిగిన గ్రామసభలో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొనగా బంటుమిల్లిలో జరిగిన గ్రామసభలో కలెక్టర్ డీకే బాలాజీ పాల్గొన్నారు. అన్ని నియోజకవర్గాల్లోనూ ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు గ్రామసభల్లో పాల్గొన్నారు.

Similar News

News November 3, 2025

నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్

image

మచిలీపట్నంలోని కలెక్టరేట్ కార్యాలయంలో ఈ నెల 3వ తేదీన ఉదయం 10:30 గంటల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక ‘మీ-కోసం’ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ బాలాజీ తెలిపారు. ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి, ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ఫిర్యాదు అభ్యర్థనలు సమర్పించవచ్చని చెప్పారు. జిల్లా ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News November 2, 2025

కృష్ణా: 22వ జాతీయస్థాయి సాఫ్ట్ టెన్నిస్ టోర్నీకి రాష్ట్ర జట్లు పయనం

image

జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో 22వ జాతీయస్థాయి సీనియర్ సాఫ్ట్ టెన్నిస్ ఛాంపియన్ షిప్‌కు ఆంధ్రప్రదేశ్ జట్లు పయనమైనట్లు ఆంధ్రప్రదేశ్ సాఫ్ట్ టెన్నిస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి దారం దిలీప్ కుమార్ తెలిపారు. ఆరు రోజుల పాటు జరిగే ఈ ఛాంపియన్ షిప్‌లో ఆంధ్రప్రదేశ్ పురుషులు, మహిళల జట్లు ప్రాతినిథ్యం వహిస్తున్నాయని పేర్కొన్నారు. క్రీడాకారులకు సంఘ సభ్యులు శ్రీనుబాబు, నీరజ శుభాకాంక్షలు తెలిపారు.

News November 1, 2025

కృష్ణా జిల్లాలో 630 మంది వితంతువులకు కొత్త పెన్షన్లు

image

కృష్ణా జిల్లా వ్యాప్తంగా 630 మంది వితంతు మహిళలకు ప్రభుత్వం కొత్తగా పెన్షన్లు మంజూరు చేసింది. నవంబర్ నెల మొదటి తేదీతో ప్రారంభమయ్యే పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఈ కొత్త లబ్ధిదారులకు కూడా పెన్షన్ అందజేయనున్నారు. జిల్లాలోని అన్ని మండలాల నుంచి దరఖాస్తులు స్వీకరించి, అర్హులైన వారిని గుర్తించి ప్రభుత్వం ఈ జాబితాను విడుదల చేసింది. ఈ పెన్షన్ల మంజూరు ద్వారా ఎన్నో కుటుంబాలు ఆర్థిక భరోసా పొందారు.