News January 31, 2025

కృష్ణా జిల్లా పరిషత్‌కు అరుదైన గౌరవం

image

కృష్ణా జిల్లా పరిషత్‌కు అరుదైన గౌరవం లభించింది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్ ఆఫ్ ఇండియా ప్రతి ఏడాది వివిధ విభాగాల్లో అవార్డ్స్‌ను అందజేస్తుంది. 2023కి పంచాయతీ విభాగంలో సబ్ క్యాటగిరీ కింద కృష్ణా జిల్లా పరిషత్‌ను ఎంపిక చేశారు. ఢిల్లీలో వచ్చే నెల ఒకటో తేదీన ఈ అవార్డ్ అందిస్తారని ZP. CEO కన్నమ నాయుడు చెప్పారు. పరిషత్ సభ్యులు అధికారుల సహకారంతోనే అవార్డు వచ్చిందని జెడ్పీ చైర్‌పర్సన్ హారిక అన్నారు.

Similar News

News February 27, 2025

కృష్ణా: నేడే ఎమ్మెల్సీ పోలింగ్.. ఓటు వేశారా.?

image

కృష్ణా జిల్లాలో నేడు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు ఈ విధంగా ఉన్నారు. జిల్లాలో మొత్తం 77 పోలింగ్ కేంద్రాలు ఉండగా 63,190 ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 35,378, స్త్రీలు 27,807, ఇతరులు ఐదుగురు ఉన్నారు. నేడు ఎన్నికలు జరగగా.. మార్చి 3వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. కూటమి అభ్యర్థి అలపాటి రాజేంద్రప్రసాద్, పీడీఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావు మధ్య పోటీ ఉండనుంది. 

News February 27, 2025

కృష్ణా: ఎన్నికలకు సర్వ సిద్ధం

image

ఎమ్మెల్సీ ఎన్నికలు రేపు(గురువారం) 27వ తేదీన జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికలకు జిల్లా వ్యాప్తంగా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా జరగాలని పోలీసులు అన్ని చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ గంగాధర్ రావు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని చెప్పారు.

News February 26, 2025

కృష్ణాజిల్లా టాప్ న్యూస్

image

* శివనామస్మరణలతో మార్మోగిన శైవ క్షేత్రాలు* పెదకళ్లేపల్లి నాగేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు* రేపు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు* డ్రై డే సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఎక్సైజ్ అధికారుల దాడులు.. మచిలీపట్నం స్టేషన్ పరిథిలో ముగ్గురు అరెస్ట్* ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో రేపు జిల్లాలో విద్యా సంస్థలకు శెలవు

error: Content is protected !!