News January 31, 2025
కృష్ణా జిల్లా పరిషత్కు అరుదైన గౌరవం

కృష్ణా జిల్లా పరిషత్కు అరుదైన గౌరవం లభించింది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్ ఆఫ్ ఇండియా ప్రతి ఏడాది వివిధ విభాగాల్లో అవార్డ్స్ను అందజేస్తుంది. 2023కి పంచాయతీ విభాగంలో సబ్ క్యాటగిరీ కింద కృష్ణా జిల్లా పరిషత్ను ఎంపిక చేశారు. ఢిల్లీలో వచ్చే నెల ఒకటో తేదీన ఈ అవార్డ్ అందిస్తారని ZP. CEO కన్నమ నాయుడు చెప్పారు. పరిషత్ సభ్యులు అధికారుల సహకారంతోనే అవార్డు వచ్చిందని జెడ్పీ చైర్పర్సన్ హారిక అన్నారు.
Similar News
News February 27, 2025
కృష్ణా: ఇప్పటి వరకు 30.59% మేర ఓట్లు పోల్

కృష్ణా జిల్లాలో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా మధ్యాహ్నం 1 2గంటలకు 30.59% ఓట్లు పోలయ్యాయి. జిల్లాలో మొత్తం 63,144 ఓట్లు ఉండగా ఇప్పటి వరకు 19,306 ఓట్లు పోలయ్యాయి. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
News February 27, 2025
MTM: సెయింట్ ఫ్రాన్సిస్లో ఓటు వేసిన కలెక్టర్

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కలెక్టర్ డీకే బాలాజీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మచిలీపట్నం సెయింట్ జాన్స్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లో కలెక్టర్ ఓటు వేశారు. ఓటు వేసిన అనంతరం పోలింగ్ జరుగుతున్న తీరును పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. కాగా పోలీసులు పోలింగ్ కేంద్రం వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.
News February 27, 2025
కృష్ణా జిల్లాలో ఓటింగ్ అప్డేట్ ఇదే.!

ఎమ్మెల్సీ ఎన్నికలు కృష్ణాజిల్లాలో ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఉదయం 10 గంటల వరకు 7,859 మంది ఓటు హక్కును వినియోగించుకున్నట్లు అధికారులు వెల్లడించారు.12.45 శాతం మంది ఓటు హక్కును వినియోగించుకున్నారని చెప్పారు. సాయంత్రం 5 గంటల వరకు ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవచ్చని అధికారులు సూచించారు. ఓటు హక్కు ప్రజల బాధ్యత అన్నారు.