News January 31, 2025

కృష్ణా జిల్లా పరిషత్‌కు అరుదైన గౌరవం

image

కృష్ణా జిల్లా పరిషత్‌కు అరుదైన గౌరవం లభించింది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్ ఆఫ్ ఇండియా ప్రతి ఏడాది వివిధ విభాగాల్లో అవార్డ్స్‌ను అందజేస్తుంది. 2023కి పంచాయతీ విభాగంలో సబ్ క్యాటగిరీ కింద కృష్ణా జిల్లా పరిషత్‌ను ఎంపిక చేశారు. ఢిల్లీలో వచ్చే నెల ఒకటో తేదీన ఈ అవార్డ్ అందిస్తారని ZP. CEO కన్నమ నాయుడు చెప్పారు. పరిషత్ సభ్యులు అధికారుల సహకారంతోనే అవార్డు వచ్చిందని జెడ్పీ చైర్‌పర్సన్ హారిక అన్నారు.

Similar News

News February 27, 2025

MTM: సెయింట్ ఫ్రాన్సిస్‌లో ఓటు వేసిన కలెక్టర్

image

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కలెక్టర్ డీకే బాలాజీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మచిలీపట్నం సెయింట్ జాన్స్ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో కలెక్టర్ ఓటు వేశారు. ఓటు వేసిన అనంతరం పోలింగ్ జరుగుతున్న తీరును పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. కాగా పోలీసులు పోలింగ్ కేంద్రం వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

News February 27, 2025

కృష్ణా జిల్లాలో ఓటింగ్ అప్డేట్ ఇదే.!

image

ఎమ్మెల్సీ ఎన్నికలు కృష్ణాజిల్లాలో ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఉదయం 10 గంటల వరకు 7,859 మంది ఓటు హక్కును వినియోగించుకున్నట్లు అధికారులు వెల్లడించారు.12.45 శాతం మంది ఓటు హక్కును వినియోగించుకున్నారని చెప్పారు. సాయంత్రం 5 గంటల వరకు ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవచ్చని అధికారులు సూచించారు. ఓటు హక్కు ప్రజల బాధ్యత అన్నారు. 

News February 27, 2025

కృష్ణా: నేడే ఎమ్మెల్సీ పోలింగ్.. ఓటు వేశారా.?

image

కృష్ణా జిల్లాలో నేడు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు ఈ విధంగా ఉన్నారు. జిల్లాలో మొత్తం 77 పోలింగ్ కేంద్రాలు ఉండగా 63,190 ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 35,378, స్త్రీలు 27,807, ఇతరులు ఐదుగురు ఉన్నారు. నేడు ఎన్నికలు జరగగా.. మార్చి 3వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. కూటమి అభ్యర్థి అలపాటి రాజేంద్రప్రసాద్, పీడీఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావు మధ్య పోటీ ఉండనుంది. 

error: Content is protected !!