News January 31, 2025
కృష్ణా జిల్లా పరిషత్కు అరుదైన గౌరవం

కృష్ణా జిల్లా పరిషత్కు అరుదైన గౌరవం లభించింది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్ ఆఫ్ ఇండియా ప్రతి ఏడాది వివిధ విభాగాల్లో అవార్డ్స్ను అందజేస్తుంది. 2023కి పంచాయతీ విభాగంలో సబ్ క్యాటగిరీ కింద కృష్ణా జిల్లా పరిషత్ను ఎంపిక చేశారు. ఢిల్లీలో వచ్చే నెల ఒకటో తేదీన ఈ అవార్డ్ అందిస్తారని ZP. CEO కన్నమ నాయుడు చెప్పారు. పరిషత్ సభ్యులు అధికారుల సహకారంతోనే అవార్డు వచ్చిందని జెడ్పీ చైర్పర్సన్ హారిక అన్నారు.
Similar News
News February 26, 2025
గుడివాడ: డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్ను పరిశీలించిన కలెక్టర్

ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లా పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలకు సంబంధించి గుడివాడ ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్ను జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పరిశీలించారు. పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్కు తీసుకున్న చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. సకాలంలో పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ మెటీరియల్ చేరేలా చూడాలన్నారు.
News February 26, 2025
కృష్ణా: MLC ఓటు వేస్తున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి.!

జనరల్ ఎలక్షన్ కంటే ఇవి కొంచెం భిన్నంగా ఉంటాయి. ఓటు వేయడానికి వెళ్లే టప్పుడు ఓటు స్లిప్తో పాటు ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డు తీసుకువెళ్లాలి. పోలింగ్ కేంద్రంలో ఓటరుకు బ్యాలెట్ పేపర్ను ఇస్తారు. అందులో అభ్యర్థుల పేర్లతో పాటు ఫొటోలు ఉంటాయి. పోలింగ్ సిబ్బంది ఇచ్చిన పెన్నుతో మీరు ఎంచుకున్న అభ్యర్థికి ప్రాధాన్యత ఇచ్చేలా 1 అని నంబర్ మాత్రమే వేయాలి. అక్షరాల్లో రాస్తే ఓటు చెల్లదు.
News February 26, 2025
కృష్ణా: 27న విద్యా సంస్థలకు సెలవు

ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఫిబ్రవరి 27న జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించినట్టు జిల్లా విద్యాశాఖాధికారి రామారావు మంగళవారం తెలిపారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆదేశాల మేరకు సెలవు ప్రకటించడం జరిగిందన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు ఈ విషయాన్ని గ్రహించి 27న తమ పాఠశాలలకు సెలవు ప్రకటించాలన్నారు.