News December 17, 2024

కృష్ణా జిల్లా రాజకీయాలను వేడెక్కించిన విగ్రహావిష్కరణ

image

ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. నూజివీడులో జరిగిన గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణలో మంత్రి పార్థసారథి, పలాస MLA గౌతు శిరీషతో కలిసి వైసీపీ నేత జోగి రమేశ్ పాల్గొనడం టీడీపీలో తీవ్ర చర్చకు దారి తీసింది. YCP హయాంలో తమను వేధించిన జోగితో కలిసి వేదిక ఎలా పంచుకుంటారని కార్యకర్తలు భగ్గుమన్నారు. దీనిపై ఇప్పటికే పార్థసారధి క్షమాపణలు తెలిపారు. TDP అధిష్ఠానం సైతం దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

Similar News

News January 10, 2026

కృష్ణా జిల్లాలో ఎస్ఐల బదిలీ

image

ఇటీవల జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన విద్యాసాగర్ నాయుడు జిల్లా పోలీస్ శాఖను ప్రక్షాళన చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా కొత్త టీమ్‌ను తయారు చేసుకుంటున్నారు. జిల్లావ్యాప్తంగా భారీగా ఎస్ఐలను బదిలీ చేశారు. మొత్తం 38 మంది ఎస్ఐలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సంక్రాంతి పండుగ వేళ జరిగిన ఈ బదిలీలు జిల్లా పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారాయి.

News January 10, 2026

కృష్ణా: కోడలి ప్రాణం తీయబోయిన మామ.. న్యాయస్థానం సీరియస్

image

కోడలిపై హత్యాయత్నానికి పాల్పడిన మామను మచిలీపట్నం పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు. రెండు రోజుల కిందట ఆకూరి నాగశ్వేతపై ఆమె మామ కత్తితో దాడి తీసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు కలిదిండి సోమరాజును అరెస్ట్ చేసి కోర్టుకు తరలించగా, న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించినట్లు చిలకలపూడి సీఐ నబీ తెలిపారు.

News January 10, 2026

బందరులో కోడలిపై హత్యాయత్నానికి పాల్పడిన మామకు రిమాండ్

image

కోడలిపై హత్యాయత్నానికి పాల్పడిన మామను మచిలీపట్నం పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు. రెండు రోజుల కిందట ఆకూరి నాగశ్వేతపై ఆమె మామ కత్తితో దాడి తీసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు కలిదిండి సోమరాజును అరెస్ట్ చేసి కోర్టుకు తరలించగా, న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించినట్లు చిలకలపూడి సీఐ నబీ తెలిపారు.