News March 22, 2024
కృష్ణా: టీడీపీ నుంచి.. నాడు తండ్రి, నేడు కుమారుడు

మైలవరం టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ తండ్రి నాగేశ్వరరావు 1972లో కాంగ్రెస్, 1983, 85లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి నందిగామ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. కృష్ణప్రసాద్ 2019(మైలవరం)లో వైసీపీ తరఫున గెలిచారు. తాజాగా ఆయన టీడీపీ నుంచి బరిలో దిగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో వసంత మరోసారి గెలిస్తే రెండు వేర్వేరు పార్టీల తరఫున విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టిన తండ్రీకుమారులుగా రికార్డెలకెక్కనున్నారు.
Similar News
News December 16, 2025
ఈ నెల 21న పల్స్ పోలియో: కలెక్టర్

ఈ నెల 21వ తేదీన నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కోరారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ముద్రించిన పల్స్ పోలియో కార్యక్రమ గోడపత్రికలను సోమవారం ఆయన కలెక్టరేట్ లో నిర్వహించారు. చిన్నారుల బంగారు భవిష్యత్తుకై పోలియో చుక్కలు తప్పక వేయించాలని తల్లిదండ్రులను కోరారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డా. యుగంధర్ తదితరులు పాల్గొన్నారు.
News December 16, 2025
ఈ నెల 21న పల్స్ పోలియో: కలెక్టర్

ఈ నెల 21వ తేదీన నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కోరారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ముద్రించిన పల్స్ పోలియో కార్యక్రమ గోడపత్రికలను సోమవారం ఆయన కలెక్టరేట్ లో నిర్వహించారు. చిన్నారుల బంగారు భవిష్యత్తుకై పోలియో చుక్కలు తప్పక వేయించాలని తల్లిదండ్రులను కోరారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డా. యుగంధర్ తదితరులు పాల్గొన్నారు.
News December 15, 2025
ధాన్యం సేకరణకు మిల్లర్లు సహకరించాలి: కలెక్టర్

రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం సేకరణకు మిల్లర్లు సహకరించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మిల్లర్లను కోరారు. సోమవారం కలెక్టరేట్లో ధాన్యం సేకరణపై రైస్ మిల్లర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లాలో ఈ సంవత్సరం 149 కంబైన్డ్ హార్వెస్టర్ల ద్వారా రైతులు కోతలు కోయడం వల్ల గోనె సంచులు, వాహనాల కొరత ఏర్పడిందని, మిల్లర్లు తమవంతుగా గోనె సంచులు, వాహనాలు సమకూర్చాలన్నారు.


