News February 12, 2025
కృష్ణా: టెన్త్ అర్హతతో 67 ఉద్యోగాలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739321683817_60300469-normal-WIFI.webp)
టెన్త్ అర్హతతో కృష్ణా జిల్లా డివిజన్లో 67 GDS పోస్టుల భర్తీకి భారత తపాలా శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. సైకిల్ లేదా బైక్ నడిపే సామర్థ్యం, వయసు 18-40 ఏళ్ల మధ్య ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి. టెన్త్లో మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. జనరల్, OBC, EWS వారికి దరఖాస్తు ఫీజు రూ.100. మిగిలిన వారికి ఉచితం. మార్చి 3 వరకు ఈ https://indiapostgdsonline.gov.in/ వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Similar News
News February 12, 2025
కృష్ణా: RTC బస్సులో తండేల్ సినిమా.. కొనకళ్ల స్పందన
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739332615323_60300469-normal-WIFI.webp)
ఆర్టీసీ బస్సులో తండేల్ సినిమా ప్రదర్శించడంపై RTC ఛైర్మన్ కొనకళ్ల నారాయణ స్పందించారు. 9వ తేదీన పలాస నుంచి విజయవాడ వస్తున్న బస్సులో సినిమా ప్రదర్శించినట్లు కంప్లైంట్ వచ్చిందని ఆయన చెప్పారు. అలా ప్రదర్శించడం అనేది తప్పని ఆయన ఖండించారు. దీనిపై ఎంక్వయిరీ జరుగుతుందని తెలిపారు. దీనికి కారకులైన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. మళ్లీ ఇలాంటివి పునరావృతం కాకుండా చూస్తామన్నారు.
News February 12, 2025
బాపులపాడు: అత్యాచారం కేసులో పదేళ్ల జైలు శిక్ష
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739281875130_71682002-normal-WIFI.webp)
అత్యాచారం కేసులో నిందితుడికి మచిలీపట్నం న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. వీరవల్లి పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. 2021లో మల్లవల్లి గ్రామంలో కాసులు అనే వ్యక్తి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా 10 ఏళ్ల ఆరు నెలల జైలు శిక్ష, రూ.3వేల జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పునిచ్చింది.
News February 11, 2025
గోదావరి జిల్లాల నుంచి వచ్చే చికెన్ తీసుకోవద్దు: కృష్ణా కలెక్టర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739270104131_50759918-normal-WIFI.webp)
ఉభయ గోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి ప్రబలిన నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కోరారు. జిల్లాకు బర్డ్ ఫ్లూ వ్యాపించకుండా తీసుకోవల్సిన చర్యలపై పలు శాఖల అధికారులతో కలెక్టర్ మంగళవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల నుంచి వచ్చే కోడి మాంసం, కోడి గుడ్లను తీసుకోవద్దన్నారు. జిల్లా సరిహద్దుల వద్ద గట్టి నిఘా పెట్టామన్నారు.