News December 19, 2024
కృష్ణా: డిప్లొమా విద్యార్థులకు ముఖ్య గమనిక

కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలో వాటర్&వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ టెక్నాలజీ కోర్సులో పీజీ డిప్లొమా(Y19) చదివిన విద్యార్థుల కోసం ‘వన్ టైం ఆపర్చునిటీ’ పరీక్షలు నిర్వహిస్తున్నారు. 2025 జనవరి 2 నుంచి ఈ పరీక్షలు నిర్వహిస్తున్నామని, లేట్ ఫీ లేకుండా ఈనెల 26లోపు విద్యార్థులు ఫీజు చెల్లించాలని KRU పరీక్షల విభాగం సూచించింది. ఫీజు వివరాలకు https://kru.ac.in/ వెబ్సైట్ చూడవచ్చని తెలిపింది.
Similar News
News November 27, 2025
MTM: పేరెంట్స్, టీచర్స్ మీటింగ్పై కలెక్టర్ సమీక్ష

రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 5వ తేదీన నిర్వహించనున్న మెగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని రాష్ట్ర విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి కోనశశిధర్ జిల్లా కలెక్టర్లకు ఆదేశించారు. రాష్ట్ర సచివాలయం నుంచి గురువారం నిర్వహించిన మెగా పేరెంట్, టీచర్స్ సమావేశంపై వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ బాలాజీ పాల్గొన్నారు. సమావేశంలో విద్యార్థుల పురోగతిపై చర్చించారు.
News November 27, 2025
కృష్ణా: త్వరలో సహాయ ఓటరు నమోదు అధికారుల పోస్టుల భర్తీ

కృష్ణా జిల్లాలో ఖాళీగా ఉన్న సహాయ ఓటరు నమోదు అధికారుల పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డి.కె. బాలాజి తెలిపారు. గురువారం ఉదయం రాష్ట్ర సచివాలయం నుంచి ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఎన్నికల పనుల పురోగతిని జిల్లాల వారీగా సమీక్షించారని కలెక్టర్ వివరించారు.
News November 27, 2025
కృష్ణా: రైతుల కష్టాన్ని దోచుకుంటున్న మిల్లర్లు..!

ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం అమ్ముకోవడానికి కృష్ణా జిల్లా రైతన్నలు నానా తంటాలు పడుతున్నారు. ప్రభుత్వం గిట్టుబాటు ధర హామీ నీటిపై రాతయ్యిందని అంటున్నారు. ఇక్కడి మిల్లర్లు కొనుగోలుకు ముందుకు రాకపోవడంతో, గోదావరి జిల్లాల మిల్లర్లు 28% తేమ ఉన్న ధాన్యాన్ని తక్కువ ధరకే కొనుగోలు చేసి రైతుల కష్టాన్ని దోచుకుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.


