News October 22, 2024

కృష్ణా: డ్రోన్ హ్యాకథాన్ విజేతలకు ప్రైజ్ మనీ ఎంతంటే.!

image

డ్రోన్ సమ్మిట్‌లో నిర్వహిస్తోన్న హ్యాకథాన్ విజేతలకు మొత్తంగా రూ.24లక్షల ప్రైజ్ మనీని అమరావతి డ్రోన్ సమ్మిట్ ఇవ్వనుంది. మొత్తం 4 కేటగిరీలలో ఈ పోటీలు నిర్వహిస్తుండగా, ప్రతి కేటగిరిలో మొదటి బహుమతిగా రూ.3లక్షలు, సెకండ్, థర్డ్ ప్రైజ్‌గా రూ.2, రూ.1లక్షను ఇవ్వనున్నట్లు డ్రోన్ కార్పొరేషన్ ఛైర్మన్ దినేశ్ చెప్పారు. విజేతలను ఎంపిక చేసే జ్యూరీలో పలు ఐఐటీలు, కేంద్ర పౌర విమానశాఖ ప్రతినిధులు ఉంటారన్నారు. 

Similar News

News November 17, 2025

కృష్ణా: SP కార్యాలయంలో ‘మీకోసం’.. 37 అర్జీలు దాఖలు

image

కృష్ణా జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ‘మీకోసం’ కార్యక్రమంలో మొత్తం 37 అర్జీలు అందినట్లు ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఎస్పీ అర్జీలను స్వీకరించారు. వాటిని కూలంకషంగా పరిశీలించి, సత్వరం పరిష్కరించేందుకు సంబంధిత పోలీస్ స్టేషన్‌లకు బదిలీ చేసినట్లు, తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు ఆయన పేర్కొన్నారు.

News November 17, 2025

కృష్ణా: SP కార్యాలయంలో ‘మీకోసం’.. 37 అర్జీలు దాఖలు

image

కృష్ణా జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ‘మీకోసం’ కార్యక్రమంలో మొత్తం 37 అర్జీలు అందినట్లు ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఎస్పీ అర్జీలను స్వీకరించారు. వాటిని కూలంకషంగా పరిశీలించి, సత్వరం పరిష్కరించేందుకు సంబంధిత పోలీస్ స్టేషన్‌లకు బదిలీ చేసినట్లు, తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు ఆయన పేర్కొన్నారు.

News November 17, 2025

‘కృష్ణా జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టండి’

image

కృష్ణా జిల్లాకు వంగవీటి మోహన రంగా పేరు పెట్టాలన్న డిమాండ్ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని రాధా-రంగా మిత్ర మండలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు బుల్లెట్ ధర్మారావు కలెక్టర్ డీకే బాలాజీని కోరారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన రంగా పేరును జిల్లాకు పెట్టాలని పెద్ద ఎత్తున పోరాడుతున్నామన్నారు.