News June 21, 2024
కృష్ణా: తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టనుంది వీరే
ఉమ్మడి కృష్ణా నుంచి ఈ సారి ఆరుగురు నాయకులు తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. టీడీపీ నుంచి వర్ల కుమార్ రాజా, కాగిత కృష్ణప్రసాద్, కొలికపూడి శ్రీనివాస్, వెనిగండ్ల రాము, యార్లగడ్డ వెంకట్రావు, బీజేపీ నుంచి సుజనా చౌదరి శాసనసభకు మొదటిసారి ఎన్నికయ్యారు. వీరిలో కృష్ణప్రసాద్(పెడన), వెంకట్రావు(గన్నవరం) 2019లో పోటీ చేసి ఓడిపోయి రెండో పర్యాయం గెలుపొందగా, మిగతా నలుగురు తొలిసారి పోటీ చేసి విజయం అందుకున్నారు.
Similar News
News October 5, 2024
విజయవాడ: నేడు అన్నపూర్ణా దేవిగా అమ్మవారి దర్శనం
శరన్నవరాత్రులలో భాగంగా దుర్గమ్మ రేపు శనివారం శ్రీ అన్నపూర్ణదేవి అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. సృష్టి, స్థితి, లయకు కారణభూతమై, జీవకోటికి ప్రాణాధారమైన ఆహారాన్ని అందించే దేవతగా అన్నపూర్ణదేవిని భక్తులు కొలుస్తారు. ఈ రూపంలో అమ్మవారిని పూజిస్తే బుద్ధి వికాసం, సమయస్ఫూర్తి, కుశలత, వాక్సిద్ధి సిద్ధిస్తాయని పండితులు చెబుతున్నారు. అన్నపూర్ణమ్మను పూజిస్తే ఆకలిదప్పుల బాధలు ఉండవని తెలిపారు.
News October 5, 2024
APTDC ఛైర్మన్గా నేడు బాధ్యతలు స్వీకరించనున్న నూకసాని
ఏపీ టూరిజం డెవలప్మెంట్ ఛైర్మన్గా డా.నూకసాని బాలాజీ శనివారం బాధ్యతలు చేపట్టనున్నారు. విజయవాడ ఆటోనగర్లోని APTDC కార్యాలయంలో ఉదయం 10.50 గంటలకు APTDC ఛైర్మన్గా నూకసాని బాధ్యతలు స్వీకరిస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్తోపాటు NDA కూటమి పక్షాల నేతలు పాల్గొంటారని పేర్కొన్నాయి.
News October 4, 2024
రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఛైర్మన్గా రవినాయుడు బాధ్యతలు
ఏపీ క్రీడా ప్రాధికార సంస్థ ఛైర్మన్గా అనిమిని రవి నాయుడు బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ క్రీడా ప్రాంగణ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. బాధ్యతతో ముందుకు సాగుతానని తెలిపారు. తనతోపాటు తోడుగా ఉన్న ప్రతి ఒక్కరికి కృతజ్నతలు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తనను ఈ స్థాయికి ప్రోత్సహించి పదవి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.