News June 11, 2024
కృష్ణా నదిలో దూకి ప్రొద్దుటూరు వాసి ఆత్మహత్య
ప్రొద్దుటూరు వైఎంఆర్ కాలనీ సాయి నగర్కు చెందిన సుబ్బారావు అనే వ్యక్తి విజయవాడలోని కృష్ణా బ్యారేజీలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతను గత ఎన్నికల్లో భారీగా పందేలు పెట్టి పెద్దమొత్తంలో డబ్బు నష్టపోయినట్లు తెలుస్తోంది. తన ఆత్మహత్యకు గల కారణాలు సూసైడ్ నోట్లో రాసినట్లు పోలీసులు చెబుతున్నారు. అందులో కొందరి పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇతన్ని బుల్లెట్ సుబ్బారావు అని కూడా అంటారు.
Similar News
News October 1, 2024
కడప జిల్లాలో త్వరలో నూతన మద్యం పాలసీ అమలు
జిల్లాలో మద్యం దుకాణాల దరఖాస్తుల స్వీకరణ కట్టుదిట్టంగా, పూర్తిగా పారదర్శకంగా జరగాలని కడప జిల్లా కలెక్టర్ శివ శంకర్ లోతేటి ఆదేశించారు. మద్యం దుకాణాల పాలసీపై జిల్లా కలెక్టర్ సంబంధిత ఎక్సైజ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. మద్యం దుకాణాలను కేటాయించుటకు గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వబోతున్నదని చెప్పారు. ఇందులో భాగంగా కడప జిల్లాలో 139 మద్యం దుకాణాలకు దరఖాస్తులు స్వీకరించబోతున్నామన్నారు.
News October 1, 2024
మైదుకూరు వద్ద రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి
కడప జిల్లా మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని శ్రీనగరం గ్రామం వద్ద సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. నంద్యాల రోడ్డులోని 49వ జాతీయ రహదారిపై కారు స్కూటర్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో మైదుకూరు పట్టణానికి చెందిన కంచర్ల రుద్రదీపు(23) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మైదుకూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మరింత సమాచారం తెలియాల్సిఉంది.
News October 1, 2024
కడప: ప్లాస్టిక్ తీసుకువస్తే బహుమతులు పొందవచ్చు
ఇళ్లలో, కార్యాలయాల్లో వాడిన ప్లాస్టిక్ వ్యర్థాలను తీసుకువస్తే ఉపయోగపడే పునర్వినియోగ వస్తువులను తీసుకు వెళ్ళవచ్చని జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి నగర ప్రజలకు పిలుపునిచ్చారు.
సోమవారం సాయంత్రం కలెక్టరేట్లోని ఛాంబర్లో ప్లాస్టిక్ వ్యర్థాలు ఇవ్వండి బహుమతులు తీసుకువెళ్లండి పోస్టర్లను ఆవిష్కరించారు. నగర పరిధిలోని రాజీవ్ పార్క్ నందు అక్టోబర్ 1 తేదీన సాయంత్రం ఇనుప వస్తువులు స్వీకరిస్తారని చెప్పారు.