News February 23, 2025
కృష్ణా: నానిలు సేఫేనా.?

వల్లభనేని వంశీ అరెస్ట్ తరువాత పేర్ని నాని, కొడాలి నానిని అరెస్ట్ చేస్తారన్న గుసగుసలు విస్తృతంగా వినిపించాయి. కూటమి నాయకులు కూడా పలు సందర్భాల్లో నెక్స్ట్ అరెస్ట్ వారే అని చెప్పారు. ఇది ఇలా ఉండగా మీ అరెస్టులు వల్ల రోమాలు కూడా ఊడవని పేర్ని నాని అన్నారు. మూడు కాకపోతే 30 కేసులు ఉంటాయని కొడాలి నాని ధీమా వ్యక్తం చేశారు. కాగా వీరన్న మాటలు ఇప్పుడు చర్చినీయాంశంగా మారాయి.
Similar News
News February 23, 2025
కృష్ణాజిల్లా TODAY TOP NEWS

*జగన్పై మంత్రి కొల్లు ఫైర్
*జగన్ మద్దతు కావాలి- MLC అభ్యర్థి
*కృష్ణా యూనివర్శిటీ వీసీగా రాంజీ
*పెనమలూరులో మంత్రుల భేటీ
*పోలవరం లాకుల వద్ద ఇద్దరి మృతి
*ఉయ్యూరులో పోటెత్తిన <<15552020>>భక్తులు<<>>
News February 23, 2025
ఉమామహేశ్వరాలయానికి రూ.55.25 లక్షలు మంజూరు

గూడూరు మండలంలోని కంకటావ గ్రామంలోని శ్రీ ఉమామహేశ్వర వెంకటాచల వేణుగోపాల స్వామి దేవస్థానం పునరుద్ధరణకు రూ.55.25 లక్షలు మంజూరయ్యాయి. పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ అభ్యర్థన మేరకు దేవదాయ శాఖ ఈ నిధులను మంజూరు చేసినట్లు పలువురు పేర్కొన్నారు. దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఈ ఆదేశాలను జారీ చేయడంతో గ్రామస్థులు, పెద్దలు వారికి ఆదివారం కృతజ్ఞతలు తెలిపారు.
News February 23, 2025
కృష్ణా జిల్లాలో విషాదం.. ఇద్దరి మృతి

కృష్ణా జిల్లాలో ఆదివారం విషాదం చోటు చేసుకుంది. పోలవరం లాకులు కొమ్మూరు వద్ద నీటిలో పడి ఇద్దరు యువకులు మరణించారు. వీరవల్లి ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. షేక్ నాగూర్ బాషా (16), షేక్ షరీఫ్ (16) తన తండ్రితో కలిసి చేపల వేటకు వెళ్లారు. ఈ క్రమంలో వారు ఇద్దరూ కాలుజారి నీటిలో పడిపోయారు. వారిని రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ వారు మరణించారు. పోలీసులు మృతదేహాలను బయటకు తీశారు.