News May 4, 2024
కృష్ణా: నేటి నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓట్ల పోలింగ్

జిల్లాలో నేటి నుంచి ప్రారంభం కానున్న పోస్టల్ బ్యాలెట్ ఓట్ల పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. మచిలీపట్నంలోని నోబుల్ కాలేజీలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్ని శుక్రవారం ఆయన సందర్శించారు. ఎన్నికల విధుల్లో ఉండే ఉద్యోగులు అందరూ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం సులభతరంగా వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశామని చెప్పారు.
Similar News
News February 9, 2026
కృష్ణా: పీజీఆర్ఎస్కు 152 అర్జీలు

కృష్ణా జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్లో 152 అర్జీలు వచ్చాయి. కలెక్టర్ డీకే బాలాజీ, జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి అందిన అర్జీలను ఆయా శాఖల అధికారులకు పరిష్కార చర్యల నిమిత్తం బదిలీ చేశారు. పంచాయతీ రాజ్కు సంబంధించి అధిక అర్జీలు అందినట్లు అధికారులు తెలిపారు.
News February 9, 2026
బందరు పోర్టుకు ‘షిప్ బిల్డింగ్’ కళ.. ఎంపీ బాలశౌరి హర్షం

మచిలీపట్నం పోర్టులో నౌకల నిర్మాణం, మరమ్మతుల సౌకర్యాలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయడంపై ఎంపీ వల్లభనేని బాలశౌరి సంతోషం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం బందరు పోర్టు రూపురేఖలను మార్చివేస్తుందని, దీనివల్ల పోర్టుకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు జీవో విడుదల చేసిన సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
News February 9, 2026
కృష్ణా: వక్ఫ్ బోర్డు ఆస్తులను పరిరక్షించాలంటూ జేసీకి వినతి

వక్ఫ్ బోర్డు ఆస్తులను పరిరక్షించాలని వైసీపీ మైనార్టీ సెల్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ సలార్ దాదా డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం మచిలీపట్నంలో జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్ను కలిసి వినతిపత్రం అందజేశారు. అంజుమన్కు సంబంధించిన భూములను ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వవద్దు అని, ఆ నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.


