News March 7, 2025

కృష్ణా: పేర్ని నానికి హైకోర్టులో ఊరట

image

మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నానికి హైకోర్టులో ఊరట లభించింది. శుక్రవారం హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. రేషన్ బియ్యం మిస్సింగ్ కేసులో ఏ6గా పేర్ని నాని ఉన్నారు. ఇదిలా ఉండగా ఇటీవల పలుమార్లు టీడీపీ నేతలు త్వరలోనే పేర్ని నాని అరెస్ట్ కాబోతున్నారని వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడం ఆసక్తికి తెరలేపింది.

Similar News

News February 25, 2026

జనగామ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తి

image

జనగామ కలెక్టర్ గా షేక్ రిజ్వాన్ బాషా బాధ్యతలు చేపట్టి మంగళవారానికి రెండేళ్లు పూర్తయింది. ఈ రెండేళ్ల పరిపాలనలో సంక్షేమ పథకాల అమలులో, అభివృద్ధి పరంగా జాతీయ, రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ పురస్కారాలను అందుకున్నారు. అదేవిధంగా ఎన్నికలను సైతం సజావుగా నిర్వహించినందుకు గాను ఇటీవల రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ కలెక్టర్ రిజ్వాన్ బాషాను సన్మానించారు.

News February 25, 2026

జగిత్యాల: 253 మంది విద్యార్థుల గైర్హాజరు

image

జగిత్యాల జిల్లాలో ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు 30 కేంద్రాల్లో ప్రశాంతంగా జరిగాయి. జనరల్ కోర్సుల్లో 6,879 మంది, ఒకేషనల్‌లో 1,029 మంది హాజరుకాగా 253 మంది గైర్హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ ఎస్‌కేఎన్‌ఆర్ జూనియర్ కళాశాలను పరిశీలించారు. అదనపు కలెక్టర్ బి.ఎస్.లత పలు కేంద్రాలు సందర్శించారు. ఒక విద్యార్థి ఆలస్యంగా రావడంతో అనుమతించలేదు. మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదు.

News February 25, 2026

విధులకు డుమ్మా… 94 మంది ప్రొఫెసర్లు, అసిస్టెంటు ప్రొఫెసర్ల తొలగింపు

image

TG: ఓ పక్క ప్రభుత్వం నుంచి రూ.లక్షల్లో జీతాలు…మరోపక్క విధులకు డుమ్మాకొడుతూ ప్రైవేటు ప్రాక్టీసు. బోధనాసుపత్రుల్లోని ప్రొఫెసర్లు, Asst ప్రొఫెసర్ల బాగోతమిది. ఒకరో ఇద్దరో కాదు రాష్ట్రవ్యాప్తంగా 94మంది కొన్నేళ్లుగా విధులకు రావడం లేదు. వీరికి నోటీసులు జారీచేసిన ప్రభుత్వం తాజాగా అందరినీ ఉద్యోగాల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. గైర్హాజరీ తేదీ నుంచే ఈ టెర్మినేషన్ అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది.