News June 30, 2024

కృష్ణా: ప్రత్యేక రైళ్లను పొడిగించిన దక్షిణ మధ్య రైల్వే

image

ప్రయాణీకుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా అగర్తల (AGTL), సికింద్రాబాద్(SC) మధ్య నడిచే ప్రత్యేక రైళ్లను పొడిగించినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ మేరకు నం.07029 AGTL- SC ట్రైన్‌ను జూలై 5 నుంచి అక్టోబర్ 4 వరకు, నెం. 07030 SC- AGTL ట్రైన్‌ను జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు నడుపుతామని రైల్వే వర్గాలు పేర్కొన్నాయి. ఈ ట్రైన్లు ఏపీలో విజయవాడతో పాటు ఏలూరు, రాజమండ్రి, గుంటూరు తదితర స్టేషన్లలో ఆగుతాయి.

Similar News

News September 20, 2024

అడుసుమిల్లి మృతిపై జగన్ దిగ్భ్రాంతి

image

మాజీ ఎమ్మెల్యే, రాజ‌కీయ విశ్లేష‌కులు అడుసుమిల్లి జ‌య‌ప్రకాశ్ మృతిపై మాజీ సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జై ఆంధ్ర ఉద్యమం, స‌మైక్యాంధ్ర ఉద్యమాల్లో ఆయ‌న కీల‌కపాత్ర పోషించారని జ‌గ‌న్ గుర్తు చేసుకున్నారు. జ‌య‌ప్రకాశ్ కుటుంబ స‌భ్యుల‌కు త‌న ప్రగాఢ సానుభూతి తెలియ‌జేశారు.

News September 20, 2024

విజయవాడకు వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్..!

image

ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో శుక్రవారం అరెస్టయిన వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌ను పోలీసులు శనివారం విజయవాడకు తీసుకురానున్నారు. శుక్రవారం మధ్యాహ్నం డెహ్రాడూన్‌లోని మూడో అడిషనల్ మెట్రోపాలిటన్ కోర్టులో విద్యాసాగర్‌ను ఏపీ పోలీసులు ప్రవేశపెట్టినట్లు తాజాగా సమాచారం వెలువడింది. డెహ్రాడూన్‌లో అరెస్టయిన విద్యాసాగర్‌ను ట్రాన్సిట్ వారెంట్‌పై పోలీసులు విజయవాడకు తీసుకురానున్నట్లు తెలుస్తోంది.

News September 20, 2024

విజయవాడ: బెయిల్ కోసం కాంతిరాణా టాటా పిటిషన్

image

సస్పెన్షన్‌లో ఉన్న IPS అధికారి కాంతిరాణా టాటా ముంబై నటి కాదంబరి జెత్వాని కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు. కాగా ఈ పిటిషన్‌ను హైకోర్టు సోమవారం విచారణ జరపనున్నట్లు సమాచారం. కాగా కాదంబరి జెత్వాని కేసులో రాష్ట్ర ప్రభుత్వం కాంతి రాణా టాటాను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.