News August 27, 2024
కృష్ణా: ప్రత్యేక రైళ్లు

ప్రయాణీకుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా హైదరాబాద్(HYB), కటక్(CTC) మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. నం. 07165 HYB- CTC ట్రైన్ను మంగళవారం నుంచి సెప్టెంబర్ 17 వరకు, నం. 07166 CTC- HYB ట్రైన్ను బుధవారం నుంచి సెప్టెంబర్ 18 వరకు నడుపుతామన్నారు. ఈ ప్రత్యేక రైళ్లు ఏపీలో విజయవాడతో పాటు గుంటూరు, ఏలూరు, రాజమండ్రి, విజయనగరం, శ్రీకాకుళం తదితర స్టేషన్లలో ఆగుతాయన్నారు.
Similar News
News November 12, 2025
రెవెన్యూ క్రీడా పోటీల్లో కృష్ణా జిల్లాకు రెండో స్థానం

అనంతపురంలో ఈ నెల 7 నుంచి 9 వరకు జరిగిన 7వ రాష్ట్రస్థాయి రెవెన్యూ క్రీడా పోటీల్లో కృష్ణా జిల్లా బృందం అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రెండవ స్థానాన్ని దక్కించుకుంది. సిబ్బంది వివిధ విభాగాల్లో పతకాలను కైవసం చేసుకున్నారు. రెవెన్యూ సిబ్బంది కృషి, నిబద్ధత ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ డీ.కే. బాలాజీ వారిని అభినందించారు.
News November 11, 2025
మచిలీపట్నం: టిడ్కో ఇళ్లను ఇవ్వాలని వినతి

టిడ్కో ఇళ్ల ఫ్లాట్లను లబ్దిదారులకు అందించాలని ఐద్వా మచిలీపట్నం నగర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ లో జరిగిన మీకోసం కార్యక్రమంలో డీఆర్ఓ చంద్రశేఖరరావును కలిసి వినతిపత్రం అందజేశారు. 2017వ సంవత్సరంలో పేదల గృహాల కొరకు అప్పటి టీడీపీ ప్రభుత్వం మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పేద ప్రజల వద్ద రూ.500ల నుంచి రూ.12,500, రూ.25,000లు వసూళ్లు చేసి గృహాలు నిర్మించారన్నారు.
News November 10, 2025
MTM: నేడు కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

జిల్లా ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు సోమవారం కలెక్టరేట్లో “మీకోసం” ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. ఉదయం 10:30 గంటలకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాలలో కూడా PGRS జరుగుతుందని ఆయన వెల్లడించారు.


